తక్షణమే చెల్లించాలి: సంతోష్

*అధ్యాపకుల జీతాలు చెల్లించని  గణపతి ఇంజనీరింగ్ కళాశాల*   


 *తక్షణమే చెల్లించాలి: సంతోష్* 


వరంగల్ జిల్లా లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ సంస్థ అయినటువంటి గణపతి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు దాదాపు 3 నుంచి 6 నెలలు ఇవ్వకపోవంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై వారి ఉద్యోగలను కూడ వదులుకునే పరిస్థితి ఏర్పడింది.అధ్యాపకుల జీతాలు 1 సంవత్సరం  నుంచి ఇవ్వకపోవడంతో వారి ఆలనా పాలనాకు,వారి ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్స్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ వ్యవరిస్తు, యాజమాన్యంను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారని ఉద్యోగులు అంత వారి ఉద్యోగాల నుంచి తప్పుకోవడం,వారందరూ కలసికట్టుగా హైదరాబాద్ లోని ఉద్యోగుల సంఘం తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులను సెప్టెంబర్ నెలలో కలసి వారి సమస్యలను వివరించడం జరిగిందన్నారు. ఈ విషయం పైన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ తెలియజేస్తూ అధ్యాపకుల జీతాల జాప్యం విషయంపైనా వినతి పత్రం తీసుకోవడం జరిగింది. అదే రోజు కళాశాల ప్రిన్సిపాల్ , చైర్మన్ లతో మాట్లాడితే వారు చెల్లిస్తాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ చెల్లించక పోవడంతో, అదే విషయాన్ని వారికి ఒక ఉత్తరం కూడ వ్రాయడం జరిగింది.కాని వారియొక్క విధానం ఏవిధంగా ఉంది అంటే మేము చెల్లించం ఏమీ చేస్తారు అనే దోరణిలో కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా పిలవబడుతున్న వరంగల్ జిల్లాలో ఉద్యోగులకు ఇంత దారుణం జరుగుతుంటే పట్టించుకునే వారే లేరని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులకు వారికి జీతాలు ఇవ్వకుండా నెలలు నెలలు కాలం వెల్లదిస్తే,వారి భవిష్యత్ ఏమిటి.వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర విద్యాహక్కు చట్టం 1982 చాప్టర్-14 సెక్షన్-84 ప్రకారంగా ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించాలని తెలియజేసిన ఆ చట్టాన్ని కళాశాల విస్మరించి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. అంతే కాకుండా ఏ ఐ సి టి ఇ విడుదల చేసిన హ్యాండ్ బుక్ పేజి నంబర్ 84 , పాయింట్ 7.4 ను మేము పాటిస్తాం అని తెలియజేసి వారికి ఆఫ్ఫీడవిట్ సంపర్పించరు,కాని అది అమలుపర్చలేదు. అధ్యాపకులకు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇలాంటి యజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ, జె.ఎన్.టి.యు.హెచ్, ఏ.ఐ.సి.టి.ఇ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చూడాలన్నారు.  యజమాన్యాము విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రియంబర్స్మెంట్ కూడా పొందినప్పటికీ అధ్యాపకుల కు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబందులకు గురి చేస్తున్నారన్నారు. గణపతి కళాశాల యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి అధ్యాపకుల జీతాలు వెంటనే చెల్లించాలి లేనివెడల జె.ఎన్.టీ.యు.హెచ్ అధికారులకు, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏ.ఐ.సి.టి.ఇ , ఉన్నత విద్యా శాఖ అధికారులు కలిసి సమస్యను వివరిస్తాం, అప్పటికి మీరు స్పందించక పోతే హైకోర్టు వెళ్ళియిన అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా  చూస్తామనీ సంతోష్ కుమార్ అన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image