తక్షణమే చెల్లించాలి: సంతోష్

*అధ్యాపకుల జీతాలు చెల్లించని  గణపతి ఇంజనీరింగ్ కళాశాల*   


 *తక్షణమే చెల్లించాలి: సంతోష్* 


వరంగల్ జిల్లా లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ సంస్థ అయినటువంటి గణపతి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు దాదాపు 3 నుంచి 6 నెలలు ఇవ్వకపోవంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై వారి ఉద్యోగలను కూడ వదులుకునే పరిస్థితి ఏర్పడింది.అధ్యాపకుల జీతాలు 1 సంవత్సరం  నుంచి ఇవ్వకపోవడంతో వారి ఆలనా పాలనాకు,వారి ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్స్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ వ్యవరిస్తు, యాజమాన్యంను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారని ఉద్యోగులు అంత వారి ఉద్యోగాల నుంచి తప్పుకోవడం,వారందరూ కలసికట్టుగా హైదరాబాద్ లోని ఉద్యోగుల సంఘం తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులను సెప్టెంబర్ నెలలో కలసి వారి సమస్యలను వివరించడం జరిగిందన్నారు. ఈ విషయం పైన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ తెలియజేస్తూ అధ్యాపకుల జీతాల జాప్యం విషయంపైనా వినతి పత్రం తీసుకోవడం జరిగింది. అదే రోజు కళాశాల ప్రిన్సిపాల్ , చైర్మన్ లతో మాట్లాడితే వారు చెల్లిస్తాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ చెల్లించక పోవడంతో, అదే విషయాన్ని వారికి ఒక ఉత్తరం కూడ వ్రాయడం జరిగింది.కాని వారియొక్క విధానం ఏవిధంగా ఉంది అంటే మేము చెల్లించం ఏమీ చేస్తారు అనే దోరణిలో కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా పిలవబడుతున్న వరంగల్ జిల్లాలో ఉద్యోగులకు ఇంత దారుణం జరుగుతుంటే పట్టించుకునే వారే లేరని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులకు వారికి జీతాలు ఇవ్వకుండా నెలలు నెలలు కాలం వెల్లదిస్తే,వారి భవిష్యత్ ఏమిటి.వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర విద్యాహక్కు చట్టం 1982 చాప్టర్-14 సెక్షన్-84 ప్రకారంగా ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించాలని తెలియజేసిన ఆ చట్టాన్ని కళాశాల విస్మరించి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. అంతే కాకుండా ఏ ఐ సి టి ఇ విడుదల చేసిన హ్యాండ్ బుక్ పేజి నంబర్ 84 , పాయింట్ 7.4 ను మేము పాటిస్తాం అని తెలియజేసి వారికి ఆఫ్ఫీడవిట్ సంపర్పించరు,కాని అది అమలుపర్చలేదు. అధ్యాపకులకు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇలాంటి యజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ, జె.ఎన్.టి.యు.హెచ్, ఏ.ఐ.సి.టి.ఇ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చూడాలన్నారు.  యజమాన్యాము విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రియంబర్స్మెంట్ కూడా పొందినప్పటికీ అధ్యాపకుల కు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబందులకు గురి చేస్తున్నారన్నారు. గణపతి కళాశాల యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి అధ్యాపకుల జీతాలు వెంటనే చెల్లించాలి లేనివెడల జె.ఎన్.టీ.యు.హెచ్ అధికారులకు, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏ.ఐ.సి.టి.ఇ , ఉన్నత విద్యా శాఖ అధికారులు కలిసి సమస్యను వివరిస్తాం, అప్పటికి మీరు స్పందించక పోతే హైకోర్టు వెళ్ళియిన అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా  చూస్తామనీ సంతోష్ కుమార్ అన్నారు.