అధునాతనంగా 108

అధునాతనంగా 108
అందుబాటులోకి వస్తున్న 750 అంబులెన్స్‌లు
మండలానికి ఒకటి చొప్పున కేటాయింపు
సంచార వైద్యశాలలకు 676 కొత్త వాహనాలు
ఏప్రిల్‌ నుంచి మెరుగుపరచిన సేవలు
-అమరావతి
అధునాతనంగా 108
అత్యవసర సేవల(108), గ్రామీణ వైద్య సేవల అంబులెన్సు(104)ల సేవలు మరింత అధునాతనంగా ప్రజలకు చేరువ కాబోతున్నాయి. బాధితులకు నాణ్యమైన సేవలు అందే విధంగా అంబులెన్స్‌ల్లో అత్యాధునిక పరికరాలు మరికొన్నింటిని అదనంగా చేరుస్తున్నారు. ఇక నుంచి ఒకే సంస్థ ద్వారా కాకుండా అత్యవసర స్పందన కేంద్రం (కాల్‌ సెంటర్‌), అంబులెన్సుల నిర్వహణ వేర్వేరు సంస్థల ద్వారా జరగబోతుంది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆధునికీకరించిన కొత్త సేవలు ఏప్రిల్‌ నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.
25 శాతం అంబులెన్సుల్లో వెంటిలేటర్లు!
108, 104 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ‘అరబిందో ఫార్మా ఫౌండేషన్‌’ దక్కించుకుంది. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒకటి వంతున 108 అంబులెన్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా వచ్చే 750 అంబులెన్సుల్లో 432 కొత్తవి. 25% అంబులెన్సుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగికి ఉపయోగపడే వెంటిలేటర్‌, గుండెపోటు వచ్చినప్పుడు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తినపుడు అత్యవసరంగా వైద్యం అందించేందుకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచబోతున్నారు. చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటిలేటర్‌, ఇంక్యుబేటర్‌, ఇతర సౌకర్యాలు కలిగిన రెండు అంబులెన్సులను జిల్లాకు రెండు చొప్పున (26) ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణాల్లో 15..గ్రామాల్లో 20 నిమిషాల్లో..
అత్యవసర స్పందన కేంద్రానికి ఫోన్‌ వచ్చినప్పటి నుంచి పట్టణాలు/నగరాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లోగా సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫోన్‌ ద్వారా సమాచారాన్ని తీసుకోవడం, వాహనాలకు సమాచారాన్ని పంపడం ఒక ఉద్యోగి ద్వారానే జరుగుతోంది. దీనివల్ల సమయం వృథా అవుతోంది. కొత్త విధానంలో మరొకరిని అదనంగా నియమిస్తున్నారు. దీనివల్ల సమయం ఆదా జరిగి ప్రమాదంలో ఉన్న వారికి వైద్య సేవలు సకాలంలో అందుతాయి. ‘మొబైల్‌ డివైజ్‌ టెర్మినల్‌ ట్యాబ్‌’ ద్వారా అంబులెన్సుల రాకపోకలు, రోగులకు అందే వైద్య సేవలను పర్యవేక్షించనున్నారు. అనుభవాన్ని అనుసరించి 108 పైలట్లకు గరిష్ఠంగా నెలకు రూ.28,000, సాంకేతిక నిపుణుడికి రూ.30,000 వరకు చెల్లింపులు జరుగుతాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ
104 సంచార వైద్యశాలల కింద 676 కొత్త అంబులెన్సులు రాబోతున్నాయి. ప్రస్తుతం 270 వాహనాలు నడుపుతున్నారు. ప్రతి వాహనం నెలకు ఒకసారి ఒక్కో గ్రామానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానికులకు వైద్య సేవలను అందిస్తుంది.
విశ్వాసాన్ని పెంచేలా సేవలు
108 అంబులెన్సుల సేవల తీరుపై విశ్వాసాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. జీవనశైలి వ్యాధులు రాకుండా ఉండేలా 104 సంచార వైద్యశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెరుగుతాయి. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల నిర్వహణకు సుమారు ప్రతి ఏడాది రూ.350 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. 108, 104 వాహనాల కొనుగోలు, పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.1,300 కోట్ల వరకు వ్యయమవుతోంది.


- వెంకట్‌ చంగవల్లి, 108, 104 సేవల ప్రభుత్వ సలహాదారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు