ఆస్పత్రులు నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన సీఎం*  

*18.02.2020*
*కర్నూలు*


*కర్నూలులో వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌*
*ఆస్పత్రులు నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన సీఎం*  


*సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు:*


*ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం కోసం నాడు–నేడు చేపట్టాం*
*ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం*
*కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో వాటిని తీర్చిదిద్దబోతున్నాం*
*పేదలు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నాం* 
*వైయస్సార్‌ కంటి వెలుగు ద్వారా అవ్వాతాతల కోసం మూడో దశ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం*
*ఈ విడత కంటి వెలుగులో 56.88 లక్షల మంది అవ్వాతాతలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తాం*
*కళ్లజోళ్లు అవసరమైన వారికి రెండు వారాల తర్వాత గ్రామ వలంటీర్లు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తారు*
*రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మేలు చేస్తున్నాం*
*ఇంత మంచి పరిపాలన చేస్తుంటే, ఓర్చుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది*
*చంద్రబాబును చూస్తున్నారు, వారి కడుపు మంట కూడా చూస్తున్నారు*
*ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నాం*
*ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది*
*కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు*
*కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు*
*వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదు*
*అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి*
*వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు* 
*వీటన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు*
*నిజాయితీతో పని చేస్తున్నాం*
*ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం*
*ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నాం*
*వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెట్టాం* 
*మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో మొదటి ఏడాది కూడా పూర్తి కాకుండానే 85 శాతానికి పైగా అమలు చేసే చర్యలు తీసుకున్నాం*
*కర్నూలు సభలో సీఎం వైయస్‌.జగన్‌*
 
*ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా మార్చబోతున్నాం*
*ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌)కు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేస్తున్నాం*
*పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏఎహెచ్‌లు, డీహెచ్‌లతో పాటు, టీచింగ్‌ ఆస్పత్రులను కూడా మార్చబోతున్నాం* 
*దీని కోసం రూ.15,335 కోట్లతో పనులు చేపడుతున్నాము*
*జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, కొత్తగా సూపర్‌ స్పెషాలిటీ* *ఆస్పత్రులు, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం*
*ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం*
*విధంగా మొత్తం 27 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలలు వస్తాయి*
*మొత్తం 175 నియోజకవర్గాలలో వచ్చే జూలై 31 వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు*
*ఆపరేషన్లు అవసరమైతే మార్చి 1 నుంచి 133 కేంద్రాలు, 11 టీచింగ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్జీఓ కంటి ఆస్పత్రుల్లో కంటి శస్త్ర చికిత్సలు జరుగుతాయి*


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు