మంత్రి సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట ఏది,టిడిపి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ వెల్లడి

 



ఓటమి భయంతోనే ఓకే గ్రామంలో ముగ్గురు  టిడిపి  పార్టీ కార్యకర్తల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు,మంత్రి సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట ఏది,టిడిపి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ వెల్లడి


,కర్నూలు,మార్చి,13 (అంతిమతీర్పు-బ్యూరో):-కర్నూలు జిల్లాలోని ఎంపీటీసీ జెడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరడంతో నామినేషన్ల ఉపసంహరణ కోసం వైసీపీ ఆగడాలు రోజురోజుకూ అంతు లేకుండా పోయిందని ఆలూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ తెలిపారు.హోళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో ముగ్గురు టిడిపి కార్యకర్తలు వేసిన ఎంపీటీసీ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడంతో నామినేషన్ వేసిన టిడిపి ఎంపిటిసి అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఇదంతా వైసిపి ఓటమి భయంతోనే,ఆలూరు నియోజకవర్గం మంత్రి ఇలాకాలో ఉండడంతోనే ఎన్నికల అధికారులు,పోలీసు సిబ్బంది అధికార పార్టీకి చెందిన నాయకులు మాటలు విని టిడిపి పార్టీకి చెందిన ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినందుకు గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులు రాళ్ల వర్షం కురిపించడంతోటిడిపికార్యకర్తలకుతీవ్రగాయాలయ్యాయి.ఆలూరునియోజకవర్గంహోళగుంద మండలం టిడిపి కార్యాలయంలో  టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ విలేకర్ల సమావేశంలోమాట్లాడుతూహోళగుందమండలంలోటిడిపి కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు దాడులు చేయడం చాలా దురదృష్టకరమని,మంత్రిగారు ఓటమి భయంతోనే మాటీడీపీకార్యకర్తలపైదాడులుచేయిస్తున్నారని,ఎంపీటీసీ స్థానాల్లో ఓడిపోతే నాకు ఎక్కడ మంత్రి పదవి వుడిపోతుందేమోనని భయంతో టిడిపి కార్యకర్తలు వేసిన బి ఫారాలు నామినేషన్ పత్రాలను ఎలా తిరస్కరిస్తారని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ప్రశ్నించగా వారు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.ఆలూరు నియోజకవర్గం అంతా అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ లేకుండా పోయిందని,నా సొంత నియోజకవర్గంలో ఓడిపోతే నాకు మర్యాద ఉండదని,నాకు ఎక్కడ మంత్రి పదవి ఊడిపోతుందని భయంతో మా టిడిపి కార్యకర్తల నామినేషన్ పత్రాలను తిరస్కరించడం జరిగిందనీ ఆలూరు టిడిపి బాధ్యులు  కోట్ల సుజాతమ్మ తెలిపారు.అధికారపార్టీ మంత్రి గారికి అంతగా ఓటమి భయం ఉంటే ఆలూరు నియోజకవర్గంలో  మా టిడిపి కార్యకర్తల నామినేషన్ పత్రాలు అన్నింటినీ తిరస్కరించామని ఎన్నికల అధికారులకు తెలియజేయండి,లేకపోతే మాతోనే చెప్పండి నేరుగా మేమమా పార్టీ కార్యకర్తలు వేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించు కుంటామని మా కార్యకర్తలకు తెలియజేస్తానని చెప్పారు.ఆలూరు నియోజకవర్గం లో ఎంపీటీసీ స్థానాల్లో ఓడిపోతే ఎక్కడ నా మంత్రి పదవి ఊడుతుందో  అనుకుంటే నేరుగా వచ్చి మాతో సంప్రదించండి మేమే నామినేషన్ పత్రాలను తిరస్కరించు కుంటామని మంత్రిగారికి కోట్ల సుజాతమ్మ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు.అనవసరంగా ఓటమి భయంతోనే మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేయించి,కేసులు బనాయించిచడం ఎంతవరకు సమంజసమని ,అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని,మరియు మా పార్టీ కార్యకర్తలపై అనవసరమైన కేసులు బనాఇస్తే  చూస్తూ ఊరుకోబోమని కోట్ల సుజాతమ్మ తెలిపారు.హోళగుంద మండలం హెబ్బటం గ్రామంలో ముగ్గురు టిడిపి ఎంపిటిసి కార్యకర్తల నామినేషన్ పత్రాలను తిరస్కరించడంతో ఇరు  పార్టీల నాయకుల మధ్య  తోపులాటలుజరిగి   ఘర్షణలు చెలరేగడంతో  రేగడంతోటిడిపి కార్యకర్తల కు బలమైన గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.హెబ్బటం గ్రామంలో పోలీసు వారు 144 సెక్షన్ విధించారు.ఇవన్నీ అధికార పార్టీ నాయకుల అండదండలతోనే మా పార్టీ కార్యకర్తలపై దాడులు జరగడానికి ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది కారణమని సుజాతమ్మ వెల్లడించారు.




 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు