అత్యవసర సరుకులకు అనేక మంది రాకూడదు

 :- నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్ హల్ లో జాయింట్ కలెక్టర్
ప్రెస్ మీట్.
రోజువారీ కూలీల కు పాస్ లు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.జిల్లాలో ఒకరికొకరు దూరంగా ఉండడం లేదు.
బైక్ మీద ఒక్కరే రావాలి.
కార్ అయితే ఇద్దరే ఉండాలి.
రేపటి నుండి చాలా గట్టిగా అన్నీ
విషయాలు చూడడం జరుగుతుంది అని తెలిపారు.
అత్యవసర సరుకులకు అనేక మంది రాకూడదు.  రేపటి నుండి
కుటుంబం నుండి ఒక్కరికే అనుమతి.వాకింగ్ చేయవద్దు ఇంట్లో యోగా చేయడం మంచిది అని తెలిపారు. చిన్నపిల్లల ను తీసుకురావద్దు.ఉదయం 6 నుండి
మధ్యాహ్నం 1 గంట వరకు పెట్రోల్
అందుబాటులో ఉంటుంది.
మధ్యాహ్నం సాధారణ ప్రజలకు
పెట్రోల్ ఇవ్వరు. రోడ్లపై టీ తాగుతూ గుంపులుగా వుండకూడదు.29.3.20 నాటికి
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం,పప్పు ఉచితంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో
రోజుకు వంద మందికి ఒక్క రోజు లో ఇస్తారు. రేషన్ షాప్ ల ద్వారా
ఇస్తారు అని తెలిపారు. కూరగాయల ను 100/- ప్యాక్ తో
కావలి, గూడూరు, నెల్లూరు లో
సంచార వాహనాల ద్వారా ప్రయోగాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో చిల్లర సామాను అమ్మే రిటైల్, హోల్ సేల్
వ్యాపారస్థుల సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది అని తెలిపారు.
మాంసాహారం అమ్మకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు
కొనడం లేదని తెలిపారు.హెల్ప్ డెస్క్ కు చాలా ఫిర్యాదులు అందాయి.హోస్టెల్స్ వారు ఆపవద్దు అని సూచించారు.
0861 2326776 నంబరు కు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని తెలిపారు.