కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేస్తున్నాం: మంత్రి గౌతమ్ రెడ్డి

 


కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేస్తున్నాం: మంత్రి గౌతమ్ రెడ్డి



అమరావతి,.ఏప్ర్రిల్, 16 (అంతిమ తీీర్పు).:


ఇప్పటికే  50 వేల కోవిడ్ కిట్లను ఉత్పత్తి చేసాం అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన లో అన్ని జిల్లాలకు, మండలాలకు కోవిడ్ కిట్లను పంపిస్తున్నాం 


 అని తెలిపారు. కరోనా కిట్ల ద్వారా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తాం .మరో 50 వేల టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయాలని సీఎం ఆదేశించారు .మొత్తం కరోనా కిట్లతో 20 లక్షల పరీక్షలు నెల రోజుల్లో చేస్తాం 


రెండు     రోజుల్లో ఇండియన్ టెక్నాలజీ తో వెంటిలేటర్లు తయారు చేస్తాం .సీఎం జగన్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైంది -.దేశంలో తొలి సారిగా ఏపీలో కరోనా కిట్స్ ఉత్పత్తి జరుగుతోంది..35 రోజుల్లోనే టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి చేశాం .సీఎం జగన్ ను స్వయంగా కేంద్ర మంత్రులు అభినందిస్తున్నారు . పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాం .కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ కిట్లను అందిస్తాం . ఇందు కోసం ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోంది . దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎమ్ఎస్ఎమ్ఈలను ఆదుకుంటాం . లాక్ డౌన్ నేపథ్యంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు రాయితీ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు . సీఎం జగన్ ఒక్కరే దేశంలో నిర్ణయం తీసుకున్నారు .పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.  అని    మంత్రి గౌతమ్ రెడ్డి. తెలిపారు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..