11 మందికి క్వారంటైన్ పూర్తి - డాక్టర్ ప్రవీణ

11 మందికి క్వారంటైన్ పూర్తి - డాక్టర్ ప్రవీణ    వరికుంటపాడు. : మండలానికి 16 మంది విదేశాల నుంచి వచ్చారని కరోనా దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా వారిని క్వారంటైన్ లో ఉంచామని వారికుంటపడు వైద్య అధికారిని డాక్టర్ ప్రవీణ బుధవారం తెలిపారు. పెదిరెడ్డిపల్లి లో పర్యటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ క్వారంటైన్  లో ఉన్న వారిలో 11 గడువు పూర్తి అయిందని వారందరు సంపూర్ణ ఆరోగ్యముగా ఉన్నారన్నారు మిగిలిన మందికి మరో నాలుగు రోజులో గడువు పూర్తి అవుతున్నదని అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి ఈ మండలానికి 523 మంది వచ్చారని వారందరు గృహ నిర్బంధములోనే ఉన్నారని తాను, తన సిబ్బంది కట్టు దిట్టమైన చర్యలతో పర్యవేక్షిస్తున్నామన్నారు  వీరిలో ఎవరు ఇల్లు విడిచి బయటకు వెళ్ళడము లేదని అందరూ సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నారని ఆమె తెలిపారు 24 పంచాయితీలలో అన్ని గ్రామాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ప్రతి వ్యక్తి సమ దూరం పాటించాలని వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలన్నారు ఆమె వెంట ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు