11 మందికి క్వారంటైన్ పూర్తి - డాక్టర్ ప్రవీణ వరికుంటపాడు. : మండలానికి 16 మంది విదేశాల నుంచి వచ్చారని కరోనా దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా వారిని క్వారంటైన్ లో ఉంచామని వారికుంటపడు వైద్య అధికారిని డాక్టర్ ప్రవీణ బుధవారం తెలిపారు. పెదిరెడ్డిపల్లి లో పర్యటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ క్వారంటైన్ లో ఉన్న వారిలో 11 గడువు పూర్తి అయిందని వారందరు సంపూర్ణ ఆరోగ్యముగా ఉన్నారన్నారు మిగిలిన మందికి మరో నాలుగు రోజులో గడువు పూర్తి అవుతున్నదని అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి ఈ మండలానికి 523 మంది వచ్చారని వారందరు గృహ నిర్బంధములోనే ఉన్నారని తాను, తన సిబ్బంది కట్టు దిట్టమైన చర్యలతో పర్యవేక్షిస్తున్నామన్నారు వీరిలో ఎవరు ఇల్లు విడిచి బయటకు వెళ్ళడము లేదని అందరూ సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నారని ఆమె తెలిపారు 24 పంచాయితీలలో అన్ని గ్రామాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ప్రతి వ్యక్తి సమ దూరం పాటించాలని వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలన్నారు ఆమె వెంట ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
11 మందికి క్వారంటైన్ పూర్తి - డాక్టర్ ప్రవీణ