ప్రజా చైతన్యంతోనే కరోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు అడ్డుక‌ట్ట‌.. * కోవిడ్-19 రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ స‌భ్యులు తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి

ప్రజా చైతన్యంతోనే కరోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు అడ్డుక‌ట్ట‌..
* కోవిడ్-19 రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ స‌భ్యులు తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి
అమ‌రావ‌తి: ఇప్పటివరకు ప్రజలు అందించిన సహకారంతో రాష్ట్రంలో 80 శాతం ప్రాంతాలలో కరోనా విస్తరించకుండా నియంత్రించగలిగామని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ మెంబర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 అనుమానిత లక్షణాలు కలిగిన వారితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులందరూ స్వీయ నిర్భంధాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కోవిడ్-19 అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తారని, అయితే ఇంట్లోనే తగిన వసతులు ఉండి స్వీయ నిర్భంధాన్ని పాటించేవారు మాత్రం ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు. స్వీయ నిర్భంధం పాటించే వ్యక్తి మంచి గాలి, వెలుతురుతో పాటు మరుగుదొడ్డి సౌకర్యం కలిగి ఉండే గదిని ఎంచుకోవడంతో పాటు సహాయ సహకారాలు కోసం ప్రత్యేకంగా ఒకరిని నియమించుకోవాలన్నారు. సబ్బు నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌తో తరచూ చేతులను కడుక్కోవాలని, వారుండే గదితో పాటు వారు తాకే వస్తువులు, పరిసరాలను, మరుగుదొడ్డిని వారే ఒక శాతం కలిగిన సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలని తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటించాలని, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు దూరంగా ఉంటూ కేవలం భోజనం తీసుకునేటప్పుడు మాత్రమే వారిని గది ద్వారం వరకు అనుమతించాలన్నారు. ఒక వేళ ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉండాల్సి వస్తే కనీసం ఒక మీటర్ దూరం పాటించాలన్నారు. స్వీయ నిర్భంధంలో ఉన్నన్ని రోజులు అన్ని వేళలా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, ప్రతి 6 నుండి 8 గంటలకు మాస్క్ లు మార్చాలని,డిస్పోజబుల్ మాస్క్ లు తిరిగి ఉపయోగించరాదన్నారు. పాజిటివ్ పేషెంట్, ఆరోగ్య కార్యకర్తలు వారి దగ్గరి సంబంధీకులు ఉపయోగించిన మాస్కులను సాధారణ బ్లీచ్ ద్రావణం(5శాతం) లేదా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ఉపయోగించి శుభ్రపరచిన అనంతరం వాటిని కాల్చివేయాలి లేదా పూడ్చి వేయాలన్నారు. స్వీయ నిర్భంధ కాలంలో సందర్శకులతో ఎట్టిపరిస్థితులలో కలవ కూడదని ఒకవేళ స్వీయ నిర్భంధం లో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వస్తే అతనిని కలిసిన వ్యక్తులందరి వివరాలు ప్రభుత్వానికి తెలియజేసి వారి రిపోర్టు కూడా నెగిటివ్ వచ్చేవరకు స్వీయ నిర్భంధంలో ఉంచటానికి సహకరించాలన్నారు. జ్వరం, జలుబు, పొడిదగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నట్లైతే ఆ ప్రాంతంలో ఉండే గ్రామ/వార్డు వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. కోవిడ్-19 కు సంబంధించి మరింత సమాచారం కోసం 104 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కానీ వాట్సప్ చాట్ బాట్ నెంబర్ 8297104104కు హాయ్ అని మెసేజ్ చేసి అధికారిక సమాచారం పొందవచ్చని తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image