కోవిడ్‌ –19 నివారణకు సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ*

 


*02–04–2020*


*కోవిడ్‌ –19 నివారణకు సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ*


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ప్రభుత్వశాఖలు, ఉద్యోగులు, వివిధ సంస్థలు, కంపెనీలు, ప్రముఖవ్యక్తులు బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. 


1.  రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ  రూ. 200.11కోట్లు



కోవిడ్‌ – 19 నివారణా చర్యలకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్‌ శాఖలనుంచి సీఎం సహాయ నిధికి రూ. 200.11 కోట్ల విరాళాన్ని అందించారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌కు చెక్కును అందించారు. జిల్లా మైనింగ్ ఫండ్, ఏపీఎండీసీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ ఉద్యోగుల విరాళం, ఉపాధి హామీ, వాటర్‌ షెడ్‌ శాఖ ఉద్యోగుల విరాళం,సెర్ప్‌ ఉద్యోగుల విరాళం మొత్తంగా కలిపి రూ.200.11 కోట్ల విరాళాన్ని కోవిడ్‌ నివారణా చర్యలకోసం సీఎం సహాయ నిధికోసం ఇచ్చారు. 
ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌ గోపాల్,  సెర్ప్‌ సీఈఓ రాజబాబు, ఏపీఎండీసీ వైస్‌ ఛైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, డీజీఎం వెంకటరెడ్డి హాజరయ్యారు. 


2.  అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.11 కోట్లు


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.11కోట్ల రూపాయలను ప్రకటించింది. ఇందులో రూ. 7.5 కోట్లను సీఎం సహాయ నిధికి చెక్కు రూపంలో అందించగా, మరో రూ.3.5 కోట్ల రూపాయలను హై ఎండ్‌ మెడికల్‌ కిట్లుకోసం, మాస్కులు, శానిటైర్స్‌ రూపంలో ఇస్తోంది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు రూ.7.5కోట్ల చెక్కును అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి అందించారు. వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


3. కియా మోటార్స్‌ రూ.2 కోట్లు


కోవిడ్‌ నివారణా చర్యల్లో ప్రతిష్టాత్మక కియా మోటార్స్‌ రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. సీఎం సహాయ నిధికి రూ. 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్టు వెల్లడించింది. విరాళాలకి సంబంధించిన పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు కియా మోటర్స్‌ ఇండియా ఎండీ కుక్‌హ్యూన్‌ షిమ్‌ అందించారు.


4. శ్రీ సిటీ ఫౌండర్‌ రూ. 2 కోట్లు


కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ సిటీ ఫౌండర్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ సన్నారెడ్డి రవీంద్ర రూ.2 కోట్ల రూపాయల విరాళం అందించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి.విజయసాయిరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. 



5.  వర్షిణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ రూ. 1.10 కోట్లు


 వర్షిని ఛారిటబుల్‌ ట్రస్టు తరఫున మెహర్‌ శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1కోటి 10 లక్షల రూపాయలను అందించారు. దీనికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సలహాదారు తలశిల రఘురాం పాల్గొన్నారు. 



6. ప్రభాస్‌ రూ.50 లక్షలు – సీఎం ప్రశంస


కరోనా వైరస్‌ నివారణకు సినీ హీరో ప్రభాస్‌ రూ. 50 లక్షల రూపాయలను అందించారు. ఈమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభాస్‌ను అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపించారు. ప్రభాస్‌ చేసిన సహాయం కోవిడ్‌ –19 నివారణా చర్యలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. 


7. జి.ఎల్‌.మంథాన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ రూ. 25 లక్షలు


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం విజయనగరానికి చెందిన జి.ఎల్‌.మంథానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం ప్రకటించారు. ట్రస్టీ బిజయ్‌ మంథానీ ఈ మొత్తాన్ని ఆన్‌ లైన్‌ ద్వారా సిఎంఆర్‌ఎఫ్‌కు జమచేశారు. 


8. ఐఏఎస్‌ అధికారుల సంఘం – 3రోజుల వేతనం


కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు రోజుల వేతనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు విరాళాలకు సంబంధించి పత్రాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ ఆసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ అందించారు. ఈ మొత్తం దాదాపు రూ.20లక్షలు ఉంటుందని ఐఏఎస్‌ అధికారులు తెలిపారు. 


9. జెల్‌కాప్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 5లక్షలు


జెల్‌కాప్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 5లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందించింది. నేరుగా ఆన్‌లైన్‌ద్వారా దీనికి సంబంధించిన మొత్తాన్ని జమచేసింది.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image