*05–04–2020*
*అమరావతి*
*ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు కరోనా మీద ఐక్య పోరాటానికి చిహ్నంగా తాడేపల్లి నివాసంలో కొవ్వొత్తులు వెలిగించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.*
అమరావతి :
కరోనా వైరస్ మీద జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఈ రాత్రి తొమ్మిది గంటలకు తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించారు. సరిగ్గా తొమ్మిది గంటలకు నివాసంలో లైట్లు ఆన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా కోవిడ్ –19 పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ ప్రజలంతా ఒక్కటై ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం ఇప్పటికే తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.