కరోనా సంక్షోభ సమయంలో వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలి :కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

   విజయవాడ, తేదీ, 30.04.2020
కరోనా సంక్షోభ సమయంలో వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలి
   కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
వయోవృద్ధులు ఎట్టిపరిస్థితులల్లో ఇళ్లు దాటి బయటకు రాకూడదని, బయటి వ్యక్తులు ఇంటికి వచ్చి కలిసేందుకు కూడా అనుమతించరాదని, తప్పని సరి పరిస్థితుల్లో బయటవారిని కలవాల్సి వస్తే ఒక మీటర్ భౌతిక దూరం పాటించాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.  సాధారణ వ్యక్తులతో పోల్చితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాదపడేవారికి కరోనా వైరస్ వల్ల ఎక్కువ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున వృద్దులు,వారి సంరక్షకులు ప్రభుత్వం ఇ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత వ్యాధులతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ, లివర్, మధుమేహం, క్యాన్సర్, పార్కిన్ సన్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని స్తున్న సూచనలు పాటించడం ద్వారా వ్యాధి సంక్రమించకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆయన కోరారు.  
సబ్బు నీటితో ఎప్పటికప్పుడు చేతులు, ముఖం కడుగుతుండాలని, తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలన్నారు. టిష్యూ పేపర్ కాని రుమాలును కాని అడ్డు పెట్టుకుంటే  వెంటనే వాటిని  పారేయడం లేదా ఉతకడం, కడగడం చేయాలన్నారు. ఇంట్లో వండిన వేడి వేడి భోజనాన్ని తీసుకోవాలని అందులో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండేలా చూడాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్ల రసాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ వ్యాయామం, ధ్యానం తో పాటు వైద్యులు సూచించిన రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. అందుబాటులో లేని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఫోన్, వీడియో కాల్ లో మాడ్లుతూ ఉండొచ్చు అన్నారు. అత్యవసరంకాని శస్త్ర, చికిత్సలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమం అన్నారు. ఇంట్లో వారు తాకిన ప్రాంతాలను, వస్తువులను క్రమం తప్పకుండా క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేయిస్తూ ఉండాలన్నారు. వృద్ధులకు జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించి వైద్య సలహాలు, సూచనలు పాటించాలన్నారు.
 వృద్ధులకు సహాయంగా ఉండేవారు పాటించాల్సిన విషయాలు పరిశీలిస్తే వృద్ధులకు సహాయం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వృద్దుల దగ్గర ఉన్నప్పుడు మాస్కును లేదా వస్త్రాన్ని రక్షణగా ఉపయోగించాలన్నారు. తరచుగా ఉపయోగించబడే వాకింగ్ స్టిక్ (చేతికర్ర), వాకర్, వీల్-కుర్చీ, బెడ్ పాన్ ఉపరితలాలను శుభ్రపరడం చేయాలన్నారు. వృద్ధులు చేతులు కడుక్కునే సమయంలో వారికి సహాయం చేయడం, సరైన ఆహారం మరియు నీరు తీసుకునెలా చూసుకోవడం, తరచూ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేలా వాకబు చేయడం చేయాలన్నారు. 
సీనియర్ సిటిజన్ల మానసిక ఆరోగ్యం పై చేయవలసిన వాటిలో ముఖ్యంగా వారిని ప్రశాంత వాతావరణంలో ఉండేలా చూడటం, సీనియర్ సిటిజన్స్ మానసిక ఆరోగ్యం పై ఇంట్లో బంధువులకు సమాచారం ఇవ్వడం, భౌతిక దూరాన్ని పాటించేలా ఇరుగు పొరుగు వారికి తెలియజేయటంతో పాటు ఒంటరితనం లేదా విసుగు చెందకుండా ఉండేందుకు పొగాకు, ఆల్కహాల్ మరియు ఇతర మందులను ఉపయోగించరాదన్నారు. జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే ఇతరులను కలవడం చేయకూడదని, కళ్ళు, ముక్కు, ముఖం లేదా నాలుకను తాకకూడదని, కరోనా బారినపడ్డవారు లేదా అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరకు వెళ్లకూడదన్నారు. స్నేహితులు, బంధువులతో కరచలనాలు, ఆలింగనాలు చేయకూడదన్నారు. సాధ్యమైనంత వరకు టెలిఫోన్ సంప్రదింపుల ద్వారా వైద్యులను సంప్రదించాలని, రద్దీ ప్రదేశాలకు వెళ్లరాదని, ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సమాచార శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.  
   


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image