ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి : మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 08-04-2020, 
అమరావతి.


దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ"


*• కరోనా పరీక్ష కిట్లు, వెంటిలేటర్ల కొరతను ముందుగానే ఊహించిన దార్శనికుడు సీఎం జగన్*


*• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 వైరస్ టెస్ట్ కిట్లు తయారు చేయడం గర్వించదగ్గ పరిణామం* 


*• అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విప్లవాత్మక మార్పులకు విశాఖ మెడ్ టెక్ జోన్  శ్రీకారం*


*• ఏపీతో పాటు, దేశానికే మెడ్ టెక్ జోన్ కిట్ల తయారీలో కీలకంగా మారుతుంది*


*• విశాఖ మెడిటెక్ జోన్ లో కోవిడ్-19 టెస్టింగ్ కిట్ల తయారీకి ఐసీఎంఆర్ అనుమతి*


*• వెంటిలేటర్ల తయారీకి అవసరమైన అన్ని అనుమతులకు  డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా  మినహాయింపు*


*• కరోనా వైరస్ ను ధృవీకరించడంలో ఈ కిట్లు చాలా అద్భుతంగా పని చేస్తాయి*


*• భారతదేశంలోనే సామర్థ్యం, నాణ్యత కలిగిన కిట్లు  అనడంలో సందేహం లేదు*


*• రోజుకు 2000 కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ*


*• రానున్న రోజుల్లో 25 వేల కిట్ల తయారే లక్ష్యం*


*• ర్యాపిడ్ టెస్టింగ్ ద్వారా గంటలోనే ఫలితం*


*• పాలిమరస్ చైన్ రియాక్షన్ (PCR)టెస్ట్ నిర్ధారణ ప్రక్రియకు  2-3 రోజుల సమయం అవసరం*


*• కిట్లు తయారీతో పాటు, 6వేల మెషిన్లు నిల్వ సిద్ధంగా ఉంది*


*• స్క్రీనింగ్ పరీక్షలకు కావలసిన సామాగ్రిని త్వరలోనే 60 శాతం సిద్ధంగా ఉంచుతాం*


*• దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత ఉన్న నేపథ్యంలో త్వరలోనే కావల్సినన్ని సమకూరుస్తాం*


*• N95 కన్నా సురక్షితమైన P 95 మాస్కుల తయారీ పనులను కూడా 4 పరిశ్రమలకు అప్పగించాం*


*• వ్యక్తిగత రక్షణ సామాగ్రీ (PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కూడా  రాష్ట్రంలో అవసరాలకు లోటు లేకుండా తయారు చేస్తాం*


*• డీఎన్ఏ , ఆర్ఎన్ఏ మోడల్ కాబట్టి కచ్చితమైన నిర్ధారణ జరుగుతుంది*


*• ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.*


*• అందుబాటులో ఉన్న వనరులతో  రోగుల ప్రాణ నష్టం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట. వైద్య పరికరాల కొరత, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికగా ముందుకు వెళుతున్నాం.*


*• అత్యవసర వైద్య పరికరాలు, మాస్కులు, టెస్టింగ్ కిట్లు తయారు చేసే పరిశ్రమలకు కావలసిన కార్మికులు, సిబ్బందికి లోటు లేకుండా చర్యలు తీసుకున్నాం*  


*•  అత్యవసర సేవలు, సామాగ్రి అందించే పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులకు పౌష్ఠికాహారం, వసతులు లోటు రానివ్వడం లేదు.*


*• కరోనా ఇబ్బందులలోనూ 25-30 శాతం పారిశ్రామిక ఉత్పత్తి చేస్తూ దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ ముందుంది. మిగతా రాష్ట్రాలలో  20 శాతం కన్నా తక్కువే.*


*• పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1000 టెస్టింగ్ కిట్లు, 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ అందజేత*


*•  ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి అందజేసిన ఏపీఐఐసీ ఉద్యోగులు:పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి*


అమరావతి, 08 ఏప్రిల్ : కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లను తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్ తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు, సలహాలు, సూచనల మేరకు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్ టెక్ జోన్ లో కరోనా నిర్ధారణ కిట్లు తయారీ చేయడం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి చొరవ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మెడిటెక్ జోన్ లో  కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతించిందన్నారు. అదే విధంగా  ప్రస్తుత విపత్తు నేపథ్యంలో వెంటిలేటర్ల తయారీకి అవసరమైన అన్ని అనుమతులకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మినహాయింపు ఇచ్చిందన్నారు. ప్రస్తుతానికి రోజుకు 2000 కోవిడ్-19  ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను తయారుచేస్తున్నామని, మరో 10 రోజుల్లో రోజుకు 25 వేల కిట్లను తయారుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిననాటి నుండి కేవలం 35 రోజుల్లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్  ను తయారుచేయగలిగామని మంత్రి పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రోబయాలజీతో కలిసి తక్కువ ధరకే రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.  ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో ఈ కిట్ ధర రూ.4500 ఉండగా తాము కేవలం రూ. 1200 కే అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ కిట్స్ తయారీకి 5 కంపెనీలకు అనుమతివ్వడం జరిగిందన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చని తెలిపారు. ఈ కిట్లను మొబైల్ కిట్లుగా ఎక్కడికైనా తరలించే అవకాశం ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా కిట్లు సరఫరా చేయాలని కోరుతున్నాయన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా కిట్లు తయారుచేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 


కోవిడ్-19 బాధితులకు వెంటిలేటర్ల సాయం అత్యవసరమని, అటువంటి వెంటిలేటర్ల తయారీకి కూడా రాష్ట్రంలో ప్రాధాన్యతనిస్తూ వాటిని కూడా విశాఖ మెడ్ టెక్ లో తయారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ క్రమంలో హిందుస్థాన్ లైఫ్ కేర్(హెచ్ఎల్ఎల్) సంస్థతో కలిసి ఏప్రిల్ 15 నుండి నెలకు 3000 వెంటిలేటర్లు మరియు మే చివరి నాటి 6 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేయనున్నామని మంత్రి తెలిపారు. కేంద్రం ఇప్పటికే 3500 వెంటిలేటర్లు కావాలని ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి తయారీకి తొలిదశలో 6 కంపెనీలను ఎంపిక చేయడం జరిగిందని, అవి ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ వాడటం ద్వారా ఒక్క వెంటిలేటర్ సహాయంతో ఐదు నుండి ఆరుగురుకి వినియోగించే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు.


రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో పరిశ్రమల శాఖ తమ వంతు సహకారంగా 1000 టెస్టింగ్ కిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా రూ. 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం(5 లక్షల 4వేల 570 రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా  అందజేశారని వెల్లడించారు.


అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విశాఖ మెడ్ టెక్ జోన్  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. 


పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ మాట్లాడుతూ, ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే మిషన్ లలో ఈ టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నామన్నారు. రాష్ట్రంలో 230 ఈ తరహా మిషన్లు ఉన్నాయని, వాటన్నింటిని వినియోగిస్తూ ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించి 55 నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 


 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image