రూ. 300కు ఆరు రకాల 12 కిలోలకు పైగా పండ్లు... హైదరాబాద్ లో హోమ్ డెలివరీ

ఈ నంబర్ కు ఫోన్ చేస్తే... రూ. 300కు ఆరు రకాల 12 కిలోలకు పైగా పండ్లు... హైదరాబాద్ లో హోమ్ డెలివరీ!


   హైదరాబాద్ :          కరోనా నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న వేళ, ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొని వుండటంతో, హైదరాబాద్, కొత్తపేట పండ్ల మార్కెట్‌ నుంచి దాదాపు 12 కిలోలకు పైగా బరువుండే  ఆరు రకాల పండ్ల ప్యాక్‌ ను రూ. 300కే హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఈ విధానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే పదివేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి.


ఇక ఈ ప్యాక్ లో భాగంగా ఒకటిన్నర కిలోల  మామిడి, మూడు కిలోల బొప్పాయి, కిలో సపోట, రెండున్నర కిలోల బత్తాయి, 4 కిలోల పుచ్చకాయ, 12 నిమ్మకాయల ప్యాక్‌ ను అందిస్తున్నారు. అయితే, ఒక్క ప్యాక్ ను హోమ్ డెలివరీ చేయరు. కాలనీలు, అపార్ట్‌ మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల వారు కనీసం 30 ప్యాక్ లు ఆర్డర్ ఇవ్వాల్సి వుంటుంది. ఆర్డర్ అందగానే, సదరు అడ్రస్ కు ఫ్రూట్ ప్యాక్స్ డెలివరీ చేస్తారు.


ఇక ఈ ఫ్రూట్ బాస్కెట్ లను పొందాలంటే 7330733212 నంబరుకు కాల్ చేయాల్సి వుంటుందని కొత్తపేట మార్కెట్ నిర్వహణా అధికారులు వెల్లడించారు. కోరిన వారందరికీ పండ్లను సరఫరా చేసేందుకు 64 టన్నుల పండ్లను, రెండు టన్నుల నిమ్మకాయలను సిద్దంగా ఉంచామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రైతులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఈ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..