సున్నా వడ్డీ పథకం పొదుపు మహిళలకు వరం :మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి

సున్నా వడ్డీ పథకం పొదుపు మహిళలకు వరం
మంత్రాలయం,ఏప్రిల్,24 (అంతిమతీర్పు):-కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని పొదుపు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం మహిళలకు వరమని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ 3 లక్షల అప్పు ఉండి ప్రతి నెలా వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్న డ్వాక్రాపొదుపు గ్రూపు  సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలు అవుతుందన్నారు. నియోజకవర్గంలోని మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల్లోని 4,823 గ్రూపులకు గాను 3,421 గ్రూపులకు రూ 5.43 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాధి నివారణ చర్యల్లో ముఖ్యంగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు నియోజకవర్గ వైఎస్సార్ బీమా పథకం కింద 19 మందికి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వెలుగు తరుపున ప్రత్యేకంగా తయారుచేసిన మాస్క్ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీపురెడ్డి, మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మాధవరం రామిరెడ్డి, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, కోసిగి మహాంతేష్ స్వామి, లక్ష్మి నారాయణ రెడ్డి, ఏపిఎం జయశ్రీ, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ ఎర్రన్న, మాజీ సర్పంచ్ టి.భీమయ్య తదితరులు ఉన్నారు.