బియ్యం కార్డులకే ఆర్థిక సాయం

బియ్యం కార్డులకే ఆర్థిక సాయం
రేషన్‌ కార్డులు బియ్యానికే పరిమితం
18 లక్షల కుటుంబాలకు సాయం దూరం
బియ్యం కార్డులకే ఆర్థిక సాయం
 అమరావతి: బియ్యం కార్డు జాబితా ఆధారంగానే ప్రస్తుతం ఆర్థిక సాయం అందించేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ)శాఖ సిద్ధమవుతోంది. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ఏళ్ల కిందట 1.47 కోట్ల రేషన్‌కార్డులనిచ్చారు. ఈ రేషన్‌కార్డులను పక్కన పెట్టేసి వైఎస్సార్‌ నవశకం కింద 1.29 కోట్ల కుటుంబాలకు ఇటీవల బియ్యం కార్డులను ఇచ్చారు. ఇప్పుడు వాటినే ఆర్థిక సాయానికి రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలోని 18 లక్షల కుటుంబాలకు ఇంటికి రూ.వెయ్యి చొప్పున అందని పరిస్థితి ఏర్పడింది. రేషన్‌ కార్డుల జాబితా ప్రకారం రూ.1,470 కోట్లు అవసరం కాగా ఇప్పుడు రూ.1,300 కోట్లనే ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా రేషన్‌కార్డుల వ్యవస్థ నడుస్తోంది. అయితే ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కొత్తగా బియ్యం కార్డులనివ్వాలని గతేడాది నిర్ణయించింది. వైఎస్సార్‌ నవశకం కింద 3నెలల కిందట వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించి 1.29 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులనిచ్చింది. ఏప్రిల్‌ నుంచి ఈ జాబితా ప్రకారమే రేషన్‌ ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
పౌరసరఫరాలశాఖకు రేషన్‌కార్డులే లెక్క
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఏప్రిల్‌లో రెండు దఫాలుగా రేషన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఏప్రిల్‌ 15 నుంచి ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఇస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా బియ్యం కార్డుల జాబితాను పక్కన పెట్టి పాత రేషన్‌కార్డుల జాబితా ఆధారంగానే 1.47 కోట్ల కుటుంబాలకు పంపిణీ చేస్తోంది. అయితే పౌరసరఫరాలశాఖ పరిధిలోని బియ్యం కార్డుదారుల జాబితా ఆధారంగా కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించాలని రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ  ఉత్తర్వులిచ్చింది.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు