కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు రూ.40 లక్షల విరాళాన్ని అందించి ..ఆదర్శంగా నిలిచిన కర్నూలు జిల్లా ఎస్ హెచ్ జి మహిళలు


కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు రూ.40 లక్షల విరాళాన్ని అందించి ..ఆదర్శంగా నిలిచిన కర్నూలు జిల్లా ఎస్ హెచ్ జి మహిళలు


డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, 4 లక్షల మంది ఎస్ హెచ్ జి మహిళలను అభినందించిన కలెక్టర్ వీరపాండియన్


కర్నూలు, ఏప్రిల్16:.(అంతిమ తీర్పు) :              కర్నూలు జిల్లా కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు *రూ.40 లక్షల విరాళాన్ని* గురువారం నాడు కలెక్టరేట్ లో కలెక్టర్ వీరపాండియన్ కు డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అందించి.. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెప్పిన సామెతను నిజం చేసి..రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎస్ హెచ్ జి మహిళలకు ఆదర్శంగా నిలిచారు కర్నూలు జిల్లా వైఎస్సార్ క్రాంతి పథం స్వయం సహాయక సంఘాల మహిళలు.


ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఇచ్చిన స్ఫూర్తితో కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి ..మేము సైతం ..అంటూ జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న దాదాపు 4 లక్షల మంది వైఎస్సార్ క్రాంతి పథం స్వయం సహాయక సంఘాల మహిళలు తమ పొదుపు నుండి ఒక్కొక్కరు 10 రూపాయలను స్వచ్చందంగా విరాళంగా ఇచ్చిన మొత్తం 40 లక్షల రూపాయల విరాళపు చెక్కును కర్నూలు జిల్లా కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం గురువారం నాడు  కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ శ్రీ జి.వీరపాండియన్ గారికి  జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పి.లక్ష్మీదేవి, డిఆర్డీఏ పిడి ఎం.కే.శ్రీనివాసులు, ఆదనపు పిడి శ్రీధర్ రెడ్డి తదితరులు అందించారు. 


జిల్లాలో వైఎస్సార్ క్రాంతి పథం లో సభ్యులుగా ఉన్న వారిలో దాదాపు 4 లక్షల మంది ఎస్. హెచ్. జి .మహిళలు పైసా పైసా పొదుపు చేసుకుని 40 లక్షల రూపాయలను  కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వడం కర్నూలు జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని ...కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా ప్రజలందరూ చేస్తున్న సమైఖ్య కృషికి ఇది నిదర్సనం అని డిఆర్డీఏ పిడి శ్రీనివాసులును, వైఎస్సార్ క్రాంతి పథం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి ని..4 లక్షల మంది ఎస్ హెచ్ జి మహిళలను కలెక్టర్ వీరపాండియన్ అభినందిస్తూ ..ధన్యవాదాలను తెలిపారు


అలాగే, కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి కోసం ఒక కోటి క్లాత్ మాస్కులను వైఎస్సార్ క్రాంతి పథం మహిళలు జిల్లా వ్యాప్తంగా కుడుతున్నట్లు డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కు వివరించారు. 


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..