జర్నలిస్ట్ లకు మంత్రి కన్న బాబు నిత్యావసర సరుకుల పంపిణీ

జర్నలిస్ట్ లకు మంత్రి కన్న బాబు నిత్యావసర సరుకుల పంపిణీ
 కాకినాడ :     ప్రస్తుత విపత్కర  పరిస్థితుల్లో నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. ప్రాణాలకు తెగించి lock down సమయంలో మీడియా చేస్తున్న కృషిని కన్నబాబు అభినందించారు. తాను ఒక జర్నలిస్ట్ గా పాత్రికేయుల కష్టనష్టాలు తనకు తెలుసునని అందుకే తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చానని కన్నబాబు తెలిపారు. తండ్రి కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా 10 లక్షల విలువైన సామగ్రి ని  సుమారు 400మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, కాయగూరలు, పండ్లను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు జర్నలిస్టులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశానని
ఆయన తెలియజేశారు. ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించిన మంత్రి కన్నబాబు కు పాత్రికేయులు అందరూ ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ నగర. కాకినాడ రూరల్, కరప మండలం చెందిన పాత్రికేయులు అంతా హాజరై మంత్రి కన్నబాబు అందజేసిన సహాయాన్ని ఆనందంతో స్వీకరించారు. ఈ కష్ట సమయంలో  తమను ఆదుకున్న కన్నబాబు కు తమ కుటుంబం అంతా రుణపడి ఉంటామని జర్నలిస్టులు తెలియజేశారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..