550 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, మామిడికాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

        ఉయ్యురు, ఏప్రిల్, 19 (అంతిమ తీర్పు) :    కరోనా వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇలాంటి సమయంలోనే అండగా ఉందాం. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


     శనివారం   ఉయ్యురు నగర పంచాయతి 20 వార్డు లో  తెలుగుదేశం పార్టీ నాయకులు పాండ్రాజు చిరంజీవి ఆధ్వర్యంలో సుధారాణి పర్యవేక్షణలో 550 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, మామిడికాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్


ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని మనమందరం లాక్ డౌన్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని అలాగే జీవన ఉపాధి లేక ఇల్లు గడవని పేదకుటుంబాలకు ఇలాంటి కష్ట సమయంలోనే మనం కలిసి కట్టుగా ఆదుకోవాలని దానిలో భాగంగానే ఈ రోజు 20 వార్డులో  చిరంజీవి ప్రతి ఇంటికి కూరగాయలు, మామిడికాయలు పంచడం అభినందనీయం అని రాజేంద్ర ప్రసాద్  అన్నారు. 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, కూనపరెడ్డి వాసు, తోట శ్రీను,lp రఫీ, నడిమింటి పైడయ్య, బూరెల నరేష్, గోరెంట్ల నరేంద్ర, పెన్నేరు సాంబయ్య మరియు చిరంజీవి ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..