మేము సైతం మీతో ఉన్నాం ;జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

విజయవాడ,ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు):
                మేము సైతం మీతో ఉన్నాం
మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులకు 53వ డివిజన్లో ఉన్న స్థానిక మున్సిపల్ డివిజన్ ఆఫీస్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మరియు 53 డివిజన్ బిజెపి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో 55 మంది పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి, నిత్యావసర సరుకులు కిట్ అందించడం జరిగింది.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ప్రజా ఆరోగ్యం పట్ల వీరు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత ఎంత కొనియాడిన తక్కువ అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం  కరోనా విపత్కర సమయంలో వీరు చేస్తున్న సేవలను గుర్తించి జీతంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు 25% బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాల్లో 10 నుంచి 15 శాతం తగ్గించి ఇవ్వడం సమంజసం కాదని వారికి కూడా పూర్తి జీతంతో పాటు బోనస్ కూడా అందించాలని మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్  మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి ఈ సేవలు కు ఉడతాభక్తిగా శాలువాతో సత్కరించి కొన్ని నిత్యావసర సరుకుల అందజేస్తున్నామని సమాజం మొత్తం వీరు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సేవలను గుర్తించి బోనస్ ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నూనె. సోమశేఖర్, సాసుపిల్లి.నాని, బాలాజీ, రాజేష్ వ్యాస్ పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image