ఆఖరి కార్డు దారుడికి సరుకులను అందజేసే వరకు రేషన్ షాపులను తెరిచే ఉంచుతాం

రాష్ట్రంలో దాదాపు ఒక కోటి రేషన్ కార్డులకు నిత్యావసరాల పంపిణీ పూర్తి
*ఆఖరి కార్డు దారుడికి సరుకులను అందజేసే వరకు రేషన్ షాపులను తెరిచే ఉంచుతాం
* రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
అమరావతి, ఏప్రిల్ 3:  రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆఖరి కార్డు దారుడికి కూడా నిత్యావసర సరుకులను అందజేసే వరకు రేషన్ షాపులను తెరిచే ఉంచుతామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్మోహన్ప్రసీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుకు ఒక కేజీ కందిపప్పు, కార్డులోని ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని 14 లక్షల 13 వేల 244 రేషన్ కార్డులకు 23 వేల 075 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 290 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి కొడాలి నాని చెప్పారు.  ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 24 వేల 017 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటి వరకు ఒక కోటి 29 వేల 833 రేషన్ కార్డులకు మొత్తం ఒక లక్ష 61 వేల 423 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 290 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.


 కాగా, అనంతపురం జిల్లాలో 12 లక్షల 23 వేల 684 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 42 వేల 511 రేషన్ కార్డులకు 14 వేల 755 మెట్రిక్ టన్నుల బియ్యం, 587 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. 


అలాగే చిత్తూరు జిల్లాలో 11 లక్షల 33 వేల 535 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 364 రేషన్ కార్డులకు 15 వేల 618 మెట్రిక్ టన్నుల బియ్యం, 890 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 


తూర్పుగోదావరి జిల్లాలో 16 లక్షల 50 వేల 254 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో 11 లక్షల 36 వేల 588 రేషన్ కార్డులకు 17 వేల 346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 860 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. 


గుంటూరు జిల్లాలో 14 లక్షల ఎనభై తొమ్మిది వేల 439 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 75 వేల 805 రేషన్ కార్డులకు 16 వేల 536 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 058 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 


కడప జిల్లాలో 8 లక్షల 02 వేల 039 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 5 లక్షల 71 వేల 041 రేషన్ కార్డులకు 9 వేల 568 మెట్రిక్ టన్నుల బియ్యం, 567 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని పేర్కొన్నారు. 


కృష్ణాజిల్లాలో 12 లక్షల 92 వేల 937 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 8 లక్షల 97 వేల 942 రేషన్ కార్డులకు 13 వేల 918 మెట్రిక్ టన్నుల బియ్యం, 886 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 


కర్నూలు జిల్లాలో 11 లక్షల 91 వేల 344 రేషన్ కార్డు ఉండగా, వీటిలో 7 లక్షల 37 వేల 762 రేషన్ కార్డులకు 12 వేల 455 మెట్రిక్ టన్నుల బియ్యం, 707 మెట్రిక్ టన్నుల కంది పప్పును సరఫరా చేశామని తెలిపారు. 


నెల్లూరు జిల్లాలో 9 లక్షల 04 వేల 220 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 6 లక్షల 10 వేల 855 రేషన్ కార్డులకు 9 వేల 385 మెట్రిక్ టన్నుల బియ్యం, 487 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. 


ప్రకాశం జిల్లాలో 9 లక్షల 91 వేల 822 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 6 లక్షల 83 వేల 558 రేషన్ కార్డులకు 10 వేల 805 మెట్రిక్ టన్నుల బియ్యం, 677 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని తెలిపారు. 


శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల 29 వేల 024 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 3 లక్షల 89 వేల 430 రేషన్ కార్డులకు 6 వేల 153 మెట్రిక్ టన్నుల బియ్యం, 369 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. 


విశాఖపట్నం జిల్లాలో 12 లక్షల 45 వేల 266 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 7 లక్షల 65 వేల 953 రేషన్ కార్డులకు 12 వేల 099 మెట్రిక్ టన్నుల బియ్యం, 725 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని చెప్పారు. 


విజయనగరం జిల్లాలో 7 లక్షల 10 వేల 528 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 4 లక్షల 87 వేల 401 రేషన్ కార్డులకు 8 వేల 426 మెట్రిక్ టన్నుల బియ్యం, 484 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామన్నారు. 


పశ్చిమగోదావరి జిల్లాలో 12 లక్షల 59 వేల 925 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 30 వేల 673 రేషన్ కార్డులకు 14 వేల 351 మెట్రిక్ టన్నుల బియ్యం, 912 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి కొడాలి నాని చెప్పారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image