కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

08–04–2020
అమరావతి


*కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష*
*అధికారుల ప్రతిపాదనలపై చర్చ*
*గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం, ఇదిచేస్తాం అని గాలిమాటలు వద్దన్న సీఎం*
*నూతన ఇండస్ట్రియల్‌ పాలసీలో వాస్తవిక దృక్పథం ఉండాలన్న సీఎం*
*పరిశ్రమలకు పెండింగులో ఉన్న ఇన్సెంటివ్‌ల చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి*
*దశలవారీగా చెల్లించడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం* 
*పారిశ్రామిక కాలుష్యాన్ని పూర్తిగా నివారించడానికి దృష్టిపెట్టాలని ఆదేశం*
*ప్రభుత్వమే వ్యర్థాల సేకరణ, నిర్వహణ చేపడుతుందన్న సీఎం*
*ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందించాలని నిర్ణయం
పరిశ్రమలపై కోవిడ్‌ ప్రభావంపైనా చర్చ*



అమరావతి: 
– కొత్త పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
– పరిశ్రమలశాఖ మంత్రి గౌతంరెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌భార్గవసహా ఉన్నతాధికారులు హాజరు.
– కొత్త పారిశ్రామిక విధానం ప్రతిపాదనలపై చర్చ
–  గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం, ఇదిచేస్తాం అని మాటలు చెప్పి చివరకు ఏదీ చేయని పరిస్థితి ఉండకూడదన్న సీఎం
– గడచిన ఐదేళ్లుగా సుమారు 4800 కోట్లు పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇంటెన్సివ్‌లు పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి
– ఇవి చెల్లించకుండా.. అది చేస్తాం, ఇది చేస్తాం.. అనిమాటలు చెప్పడంవల్ల ప్రయోజనం ఉండదన్న ముఖ్యమంత్రి
– ఎవ్వరినీ మోసం చేసే రీతిలో, హామీ ఇచ్చి చివరకు ఏదీ ఇవ్వకూడని రీతిలో ఈపాలసీ ఉండకూడదన్న ముఖ్యమంత్రి.
– మనం చెప్పే మాటలపై పరిశ్రమలు పెట్టేవారికి విశ్వాసం ఉండాలన్న సీఎం
– ఇంటెన్సివ్‌ల రూపంలో ఉన్న బకాయిలను దశల వారీగా చెల్లించడానికి ప్రరయత్నాలు మొదలుపెట్టాలన్న సీఎం.
– పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కేటగిరీ పరిశ్రమల వారీగా ఈ ఇంటెన్సివ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాలన్న సీఎం
– పరిశ్రమలకు భూమి, నీరు, కరెంటు ఇద్దామని, వీటి విషయంలో నాణ్యమైన సేవలు అందిద్దామన్న సీఎం. 
– భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల వారీగా ఆధారపడ్డ ఉద్యోగులు ఎంతమంది అన్నదానిపై వివరాలు తయారుచేయాలని సీఎం ఆదేశం
– పెద్ద సంఖ్యలో ఉపాధినిస్తున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటునందించేదిశగా అడుగులు ముందుకువేయాలన్న సీఎం
– ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంపై కోవిడ్‌–19 ప్రభావంపై సమావేశంలో చర్చ
– ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలపైనా సమావేశంలో చర్చ.
– మారుతున్న పరిణామాలు, వివిధ దేశాల ఆలోచనల్లో మార్పులు కారణంగా రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్దికి తోడ్పడే వివిధ కేటగిరీల పరిశ్రమలపైనా కసరత్తు చేయాలన్న సీఎం
– రాష్ట్రంలోని పరిశ్రమలపైనా కరోనా వైరస్‌ ప్రభావంపై సమావేశంలో చర్చ.
– కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభావాన్ని అంచనావేస్తోందని, తుదిగా ఒక విధానం వెలువడే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.
– దీనిపై కూడా దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. 



కాలుష్య నివారణకు పెద్దపీట:
– రాష్ట్రంలో కాలుష్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలని స్పష్టంచేసిన సీఎం
– ప్రతి పరిశ్రమ నుంచి కూడా వచ్చే పొల్యూషన్‌ను జీరో స్థాయికి చేర్చాలన్న ముఖ్యమంత్రి
–పరిశ్రమలనుంచి వ్యర్థాలను సేకరించి కాలుష్యం లేకుండా చేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తోందన్న సీఎం
– సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా ఆ కాలుష్య నివారణా విధానం ఉండాలన్న సీఎం
– పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన నీటినే వినియోగించేలా ఇదివరకే ఆలోచనలు చేసినందున, దీనిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image