వలస కూలీలు హోం క్వారంటైన్ పాటించండి

వలస కూలీలు హోం క్వారంటైన్ పాటించండి
మంత్రాలయం,ఏప్రిల్, 30 (అంతిమ తీర్పు):-
గుంటూరు, చీరాల, సత్తైనపల్లి తదితర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వలస కూలీలు తప్పకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించాలని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి కోరారు. గురువారం ఉదయం మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోణ గ్రామ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఇతర ప్రాంతాల నుంచి 10 బస్సులో వచ్చిన దాదాపు 300 మంది వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి వలస కూలీలకు టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులు , పారిశుధ్య కార్మికుల పని తీరు చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి కరోనా వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాంపురం, కాచాపురం, రచ్చమర్రి, ఆకుల బిచ్చాల, గుండ్రేవుల తదితర గ్రామాలకు చెందిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో సోంత గ్రామాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాధ, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, వైద్యాధికారి సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image