కుప్పం అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్... పలు కీలక సూచనలు

కుప్పం అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్... పలు కీలక సూచనలు...


కుప్పం అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య, రెవిన్యూ, పోలీస్, వ్యవసాయ, ఉద్యాన, మున్సిపల్ అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గున్నారు. కుప్పంలో పాజిటివ్ కేసులు లేకపోవడం సంతోషం అని అన్నారు. బాగా పనిచేస్తున్న అధికారులకు చంద్రబాబు అభినందనించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టుల వద్ద బందోబస్తు చర్యలు పెంచాలి అన్నారు. ఒకసారి వస్తే కరోనా వైరస్ అంతటితో ఆపలేం అని, కరోనాను మొదట్లోనే నియంత్రించాలని, చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "కుప్పంలో పాజిటివ్ కేసులు లేకపోవడం సంతోషం. బాగా చేస్తున్న అధికారులకు అభినందనలు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి. చెక్ పోస్ట్ ల వద్ద బందోబస్తు చర్యలు పెంచాలి. ఒకసారి వస్తే కరోనా వైరస్ అంతటితో ఆపలేము. అందుకే దీనిని మొదట్లోనే నియంత్రించాలి. కరోనా విధ్వంసం 3వ ప్రపంచ యుద్దాన్ని తలపిస్తోంది. రెండో ప్రపంచ యుద్దంలోనూ ఇంత ప్రాణనష్టం లేదు. కరోనా రోగుల సంఖ్య మరో 2రోజుల్లో 2మిలియన్లు కానుంది. ఇప్పటికే లక్షా 15వేల మంది మరణించారు. న్యూయార్క్ లో శవాలను పూడ్చటానికి కూడా చోటు ఉండటం లేదు."


"కరోనాతో సమాజం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది ఏ ఊరికో, జిల్లాకో, దేశానికో పరిమితం కాలేదు. దావానలంలా ప్రపంచం అంతా కరోనా విస్తరిస్తోంది. గత 3వారాల్లోనే దేశంలో 100 రెట్లు పెరిగింది. మన రాష్ట్రంలో 200రెట్లు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరిగితే మనచేతుల్లో ఏమీ ఉండదు. అందుకే అసలు కేసులే రాకుండా చూసుకోవాలి. కుప్పంలో కేసులు రాకుండా చూస్తున్న అధికారులు అందరికీ అభినందనలు. డాక్టర్లు, అంగన్ వాడి సిబ్బంది, ఆశావర్కర్లు, పారిశుద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. అధికారులు అందరూ సమష్టిగా పని చేయాలి. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంగా పని చేయాలి. ప్రజలంతా అధికారులకు పూర్తిగా సహకరించాలి. కుప్పంలో 100 పంచాయితీలు, 632గ్రామాల్లో పారిశుద్యం మెరుగుపర్చాలి. హైపో క్లోరైడ్ పిచికారీ చేయాలి. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు సిద్దంగా ఉంచాలి. "
"నెల్లూరు డాక్టర్ మృతి కరోనా తీవ్రతకు నిదర్శనం. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి మాస్క్ లు, పిపిఈలు అందజేయాలి. ఆసుపత్రులలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సద్వినియోగం చేసుకోవాలి. 186గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను వినియోగించుకోవాలి. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. మార్కెట్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. చౌకడిపోలు, మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించాలి. క్వారంటైన్ కేంద్రాలలో వసతులు పెంచాలి. కుప్పంలో ఇంకా 3వేల మందికి రూ 1000, రేషన్ సరుకులు అందలేదు. కూపన్లు ఇచ్చి ఏ రోజు ఎవరెవరు రేషన్ కు రావాలో ముందే చెప్పాలి. చౌకడిపోల వద్ద భౌతికదూరం పాటించాలి. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తే ఈ సమస్య ఉండదు. వేసవి 3నెలలు తాగునీటి కొరత లేకుండా చూడాలి. పండ్లతోటలు, పూలతోటల రైతులకు అండగా ఉండాలి. సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలి. నీటి కొరత, దిగుబడి తగ్గి, ధర తగ్గి సెరికల్చర్ రైతులు నష్టాల్లో మునిగారు. టమాటా, అరటి, మామిడి, పూలతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలని" చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image