సియం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ఏపి పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు టిడిపి ఎమ్మెల్సీ వైవిబి

*కృష్ణ జిల్లా (విజయవాడ)*


_*సియం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ఏపి పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు టిడిపి ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్*_


కరోనా విధుల్లో పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను మీ ప్రభుత్వం ఆదేశించింది. 


*కానీ గత 45రోజులుగా మేము నిధులను వినియోగించు కోకుండా నిషేధం విధించి ఫ్రీజింగ్ లో పెట్టారు.*


కేంద్రం ఇచ్చిన నిధులు, మా సొంత నిధులపై కూడా ఈ ఫ్రీజింగ్ కొనసాగుతుంది. 


*సియంఎస్ఎస్ విధానంలో గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి.*


20రోజుల క్రితమే 14వ ఆర్ధిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు 870కోట్లు, మున్సిపాలిటీలకు 441కోట్లు విడుదల చేసింది. 


_*ఈ నిధులను కరోనా పనులకు వాడాలని కేంద్ర ఆర్ధికమంత్రి చెప్పినా..రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది.*_


14వ ఆర్ధిక సంఘం నిధులు 1311కోట్లు, మా సిబ్బంది వసూలు చేసిన పన్నుల నిధులు 2500కోట్లు మొత్తం 3811కోట్లు సొంత అవసరాలకు వాడేశారు


*కరోనా విపత్తు నుంచి గ్రామాలు, పట్టణాల ప్రజలను రక్షించేందుకు బ్లీచింగ్, ఫినాయిల్, కొనేందుకు కూడా మన వద్ద నిధులు లేవు.*


పంచాయితీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్ లు గత రెండు నెలలుగా అప్పులు చేసి, సొంతడబ్బులతో పనులు చేయిస్తున్నారు. 


*కొన్ని ప్రాంతాలలో అవి కూడా చేయించలేక ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.* 


పంచాయితీలు, మున్సిపాలిటీలలో శానిటరీ సిబ్బందికి నెల నుంచి రెండు నెలల జీతాలు ఇవ్వలేదు.


*కరోనా మహమ్మారిని ఎదుర్కుంటూ ప్రజలను రక్షిస్తున్న పారిశుద్ద్య సిబ్బందికి మాస్క్ లు, గ్లౌజులు, పిపిఇ కిట్లు అందించలేకపోయారు.*


కేంద్రం పంపిన నిధులు ఉన్నా కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది 


*ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.*


గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల నిధుల వినియోగం పై ఉన్న ఫ్రీజింగ్ ను వెంటనే ఎత్తివేయాలి.


*కరోనాను ఎదుర్కొనేందుకు, పారిశుధ్ద్య సిబ్బంది కోసం బ్లీచింగ్, ఫినాయిల్, మాస్క్ లు, గ్లౌవుజులు, పిపిఇ కిట్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.*


పారిశుధ్య సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు చెల్లించడంతో పాటు మరో నెల జీతం అడ్వాన్స్ గా ఇవ్వాలి.


*ఇటువంటి కఠిన వాస్తవాల గురించి మాట్లాడిన నగర మున్సిపల్ కమిషనర్ వెంటకరామిరెడ్డిని సస్పెండ్ చేశారు.*


ప్రజా సంక్షేమం కోసం వాస్తవ సమస్యలు ఎత్తిచూపితే అధికారులను సస్పెండ్ చేయడం సమంజసమా..?


*రామిరెడ్డి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.*


కరోనాను ఎదుర్కొనేందుకు వీలైతే రాష్ట్ర ప్రభుత్వమే తన సొంతనిదులను గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చి ఆదుకోవాలి


*కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మల్లించి మీ సొంత అవసరాలకు వాడుకోవడం అన్యాయం.*


పారిశుధ్య పనులు, బ్లీచింగ్ కూడా చల్లలేని దుస్థితిలోకి మా స్థానిక సంస్థలను నెట్టివేయవద్దని ఏపి పంచాయితీ రాజ్ ఛాంబర్ తరుపున మనవి చేసుకుంటున్నాం...