అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం పాటించండి. :. వింజమూరు తహసిల్ధారు వినూత్న ప్రచారం

అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం పాటించండి. :. వింజమూరు తహసిల్ధారు వినూత్న ప్రచారం


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం, సమదూరం పాటించండి అంటూ వింజమూరు తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు వింజమూరులో నిత్యం వినూత్న తరహాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజులకు పైబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి ప్రజలు స్వీయ నిర్భంధంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి సర్వత్రా తెలిసిందే. అయితే ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు, పాల కేంద్రాలు, మెడికల్ షాపులకు మినహాయింపులున్నాయి. వీటి వద్ద మాత్రం ప్రజలు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తహసిల్ధారు ప్రతిరోజూ ఉదయం కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ధరల పట్టికల దగ్గర నుండి సరుకులు కొనుగోళ్ళును పరిశీలిస్తూ మధ్య మధ్యలో వినియోగదారులకు సమదూరం పాటించండి, స్వీయ నిర్భంధంలో ఉండండి అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకొంటున్న వైనం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సాక్షాత్తూ తహసిల్ధారు మరియు మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉండి కూడా సాధారణ పౌరుని మాదిరిగా తెల్లవారుజామునే రోడ్లుపైకి చేరుకుని కరోనా నియంత్రణ డ్యూటీలో నిమగ్నం కావడం అభినందనీయమని పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత నెల రోజులకు ముందు చేజర్ల నుండి సాధారణ బదిలీలలో భాగంగా వింజమూరు తహసిల్ధారుగా సుధాకర్ రావు భాధ్యతలు చేపట్టారు. అనంతరం లాక్ డౌన్ లో భాగంగా ఆయన ఇంటికో, కార్యాలయానికో పరిమితం కాలేదు. ఉదయాన్నే 5 గంటలకు మార్నింగ్ వాక్ అంటూ ప్రధాన కూడళ్ళలోకి వచ్చేస్తున్నారు. కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద తిష్టవేసి ధరలు అదుపులో ఉన్నాయా లేదా కృత్రిమ కొరత ఉందా అనే విషయాలను వినియోగదారులను అడిగి తెలుసుకుంటున్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు