అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం పాటించండి. :. వింజమూరు తహసిల్ధారు వినూత్న ప్రచారం

అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం పాటించండి. :. వింజమూరు తహసిల్ధారు వినూత్న ప్రచారం


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం, సమదూరం పాటించండి అంటూ వింజమూరు తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు వింజమూరులో నిత్యం వినూత్న తరహాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజులకు పైబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి ప్రజలు స్వీయ నిర్భంధంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి సర్వత్రా తెలిసిందే. అయితే ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు, పాల కేంద్రాలు, మెడికల్ షాపులకు మినహాయింపులున్నాయి. వీటి వద్ద మాత్రం ప్రజలు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తహసిల్ధారు ప్రతిరోజూ ఉదయం కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ధరల పట్టికల దగ్గర నుండి సరుకులు కొనుగోళ్ళును పరిశీలిస్తూ మధ్య మధ్యలో వినియోగదారులకు సమదూరం పాటించండి, స్వీయ నిర్భంధంలో ఉండండి అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకొంటున్న వైనం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సాక్షాత్తూ తహసిల్ధారు మరియు మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉండి కూడా సాధారణ పౌరుని మాదిరిగా తెల్లవారుజామునే రోడ్లుపైకి చేరుకుని కరోనా నియంత్రణ డ్యూటీలో నిమగ్నం కావడం అభినందనీయమని పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత నెల రోజులకు ముందు చేజర్ల నుండి సాధారణ బదిలీలలో భాగంగా వింజమూరు తహసిల్ధారుగా సుధాకర్ రావు భాధ్యతలు చేపట్టారు. అనంతరం లాక్ డౌన్ లో భాగంగా ఆయన ఇంటికో, కార్యాలయానికో పరిమితం కాలేదు. ఉదయాన్నే 5 గంటలకు మార్నింగ్ వాక్ అంటూ ప్రధాన కూడళ్ళలోకి వచ్చేస్తున్నారు. కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద తిష్టవేసి ధరలు అదుపులో ఉన్నాయా లేదా కృత్రిమ కొరత ఉందా అనే విషయాలను వినియోగదారులను అడిగి తెలుసుకుంటున్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image