పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ

*పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ*


గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం క్రోసూరులో   గురువారం రోజు *పోలీసులు దాడిలో ఒక  వ్యక్తి అపస్మారక  స్థితి అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సత్తెనపల్లి డిఎస్పీ తీవ్రంగా ఖండించారు*


గత కొన్నిరోజులుగా క్రోసూరు మండల కేంద్రంలో  పొలాలలో *పేకాటరాయుళ్లు విచ్చలవిడిగా పేకాడుతున్నాట్లు గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారాన్ని ఫోన్ ల ద్వారా, వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్న తరుణంలో* గురువారం రోజు పక్కా సమాచారం అందుకున్న లోకల్ SI ఆనంద్ పొలాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. 


పోలీసుల రాకను గమనించిన పేకాటరాయుళ్లు సుమారు 30 నుండి 40 మంది వరకు తమ స్థావరాల నుండి తప్పించుకోవడానికి *పరుగులు తీశారని* అందులోని వారిని 8 మంది పట్టుకొని అరెస్టు చేయటం జరిగిందని డిఎస్పీ తెలిపారు.


*అక్కడే ఉన్న పేకాట చూస్తున్న పెద్దాయన పరుగు తీయలేక చేలో పడిపోయాడని ఆయన తెలిపారు*


 ప్రాధమిక  విచారణలో ఇతనికి ఆరోగ్యరీత్యా అనారోగ్యంతో బాధపడుతూ గతంలో గుంటూరు రామసుబ్బారెడ్డి వైద్యశాల.  కారుమూరి వైద్యశాలల్లో, నరసరావుపేట GBR వైద్యశాలల్లో,  సత్తెనపల్లి సంజన వైద్యశాల శ్రీధర్ వద్ద పరీక్షలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.


ప్రస్తుతం క్రోసూరు నుండి అతన్నీ సత్తెనపల్లి మహేశ్వరెడ్డి వైద్యశాలలో  చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.


ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఇతను బ్యాక్ పెయిన్, నరాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని డిఎస్పీ వివరించారు.


క్రోసూరు లో అదే ప్రాంతాని చెందిన చర్చి ఫాస్టర్ జేమ్స్ మాట్లాడుతూ గతంలో నేను వైద్యం ఇతనికి వైద్య సహాయం కోసం వైద్యులకు చూపించినట్లు సత్తెనపల్లి వైద్యశాల. వద్ద విలేకరులతో తెలిపారు.


విలేకరుల సమావేశంలో  పట్టణ CI విజయచంద్ర, క్రోసూరు SI ఆనంద్,  క్రోసూరు చర్చి ఫాస్టర్ జేమ్స్ మరియు సిబ్బంది ఉన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image