పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ

*పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ*


గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం క్రోసూరులో   గురువారం రోజు *పోలీసులు దాడిలో ఒక  వ్యక్తి అపస్మారక  స్థితి అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సత్తెనపల్లి డిఎస్పీ తీవ్రంగా ఖండించారు*


గత కొన్నిరోజులుగా క్రోసూరు మండల కేంద్రంలో  పొలాలలో *పేకాటరాయుళ్లు విచ్చలవిడిగా పేకాడుతున్నాట్లు గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారాన్ని ఫోన్ ల ద్వారా, వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్న తరుణంలో* గురువారం రోజు పక్కా సమాచారం అందుకున్న లోకల్ SI ఆనంద్ పొలాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. 


పోలీసుల రాకను గమనించిన పేకాటరాయుళ్లు సుమారు 30 నుండి 40 మంది వరకు తమ స్థావరాల నుండి తప్పించుకోవడానికి *పరుగులు తీశారని* అందులోని వారిని 8 మంది పట్టుకొని అరెస్టు చేయటం జరిగిందని డిఎస్పీ తెలిపారు.


*అక్కడే ఉన్న పేకాట చూస్తున్న పెద్దాయన పరుగు తీయలేక చేలో పడిపోయాడని ఆయన తెలిపారు*


 ప్రాధమిక  విచారణలో ఇతనికి ఆరోగ్యరీత్యా అనారోగ్యంతో బాధపడుతూ గతంలో గుంటూరు రామసుబ్బారెడ్డి వైద్యశాల.  కారుమూరి వైద్యశాలల్లో, నరసరావుపేట GBR వైద్యశాలల్లో,  సత్తెనపల్లి సంజన వైద్యశాల శ్రీధర్ వద్ద పరీక్షలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.


ప్రస్తుతం క్రోసూరు నుండి అతన్నీ సత్తెనపల్లి మహేశ్వరెడ్డి వైద్యశాలలో  చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.


ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఇతను బ్యాక్ పెయిన్, నరాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని డిఎస్పీ వివరించారు.


క్రోసూరు లో అదే ప్రాంతాని చెందిన చర్చి ఫాస్టర్ జేమ్స్ మాట్లాడుతూ గతంలో నేను వైద్యం ఇతనికి వైద్య సహాయం కోసం వైద్యులకు చూపించినట్లు సత్తెనపల్లి వైద్యశాల. వద్ద విలేకరులతో తెలిపారు.


విలేకరుల సమావేశంలో  పట్టణ CI విజయచంద్ర, క్రోసూరు SI ఆనంద్,  క్రోసూరు చర్చి ఫాస్టర్ జేమ్స్ మరియు సిబ్బంది ఉన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..