మండల సరిహద్దుల పహరాలో ప్ర్ర్రత్యేక మొబైల్ బృందాలు

సరిహద్దుల పహరాలో ప్ర్ర్రత్యేక మొబైల్ బృందాలు.


వింజమూరు, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైర్రస్ నానాటికీ విస్తరిస్తున్న తరుణంలో వింజమూరు మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉన్నప్పటికీ మున్ముందు కూదా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాకుండా మండల టాస్క్ ఫోర్స్ ప్రత్యేకాధికారులు పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టారు. కొండాపురం మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ మండల వాసులు వింజమూరుకు రాకపోకలు సాగించడంపై నిషేదం విధించారు. అంతేగాక ఇతర ప్రాంతాల నుండి సైతం వింజమూరు మండలంలోకి ఎవరూ రావద్దంటూ అధికారులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మండల సరిహద్దుల్లో 6 చోట్ల వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నివారించే దిశగా పలు శాఖల సిబ్బందిని నియమించారు. బంగ్లాసెంటర్ చెక్ పోస్టు వద్ద మంగళవారం నుండి తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ బృందంలో వెలుగు ఏ.పి.యం శ్రీనివాసరావు, వి.ఆర్.ఓ కె.వెంగయ్య, సచివాలయ ఉద్యోగులైన గ్రామ సర్వేయర్ సి.హెచ్.నాగశివ,, మహిళా పోలీసు మాధవి, వెటర్నరీ ఉద్యోగి జి.మహేశ్వర్, వి.ఆర్.ఏ సుందరయ్య, వి.ఏ.ఏ ఎస్కే.హిమాం సాహెబ్, చెక్ పోస్టు సిబ్బంది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు