ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం :భూగర్భగనులశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


24.4.2020 
అమరావతి 


రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులశాఖామంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటన లో ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయ్యేరని  ఎపి రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు అని అన్నారు.



- గత ఎన్నికల్లో పొరపాటుగా టిడిపికి 23 అసెంబ్లీ, 3 ఎంపి స్థానాలు వచ్చాయి.



- ప్రజా విశ్వాసంను కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఇకపై అవికూడా రావు.



- రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వుండదు. 



- ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడు. 



- హైదరాబాద్ లోని ఇంటిలో కూర్చుని బయటకు రాకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.



- కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?



- ప్రజలకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జవాబు చెప్పుకోవాలి.



- ఒకవైపు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు.



- కానీ రాష్ట్రప్రభుత్వం చేసే ప్రతి పనిని చంద్రబాబు బూతద్దంలో తప్పుగా చూస్తు విమర్శలు చేస్తున్నాడు.



- ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నాడు.



- చంద్రబాబు అబద్దపు మాటలు నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరు.



- ప్రతిపక్ష నేతగా కరోనా సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి.



- కానీ దానికి భిన్నంగా చంద్రబాబు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాడు.



- ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలి.



- రాష్ట్రంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యల వల్ల కోవిడ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయి. 


- కోవిడ్ నేపథ్యంలో కేవలం నాలుగు వారాల్లో తొమ్మిది ల్యాబ్ లను ఏర్పాటు చేశాం. 


- దేశంలో సగటు పరీక్షల కన్నా మూడు రెట్లు అంటే రోజుకు 961 టెస్ట్ లు చేస్తున్నాం. 


- కోవిడ్ అనుమానిత వైద్య పరీక్షలు చేయడంలో దేశంలోనే మనం ప్రథమ స్థానంలో వున్నాం. 


- ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. 


- రాష్ట్రంలో 7900 మంది క్వారంటైన్ లో వున్నారు. వారికి అన్ని వసతులు అందుబాటులో వుంచాం. 


- దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు టెలిమెడిసిన్ ను ప్రారంభించారు. 


- సీఎంగారి పట్టుదలతో ప్రారంభించిన టెలిమెడిసిన్ లో 300 మంది వైద్యులు పనిచేస్తున్నారు. 


- 14400 నెంబర్ కు మిస్ట్ కాల్ చేస్తే చాలు వైద్యులు వైద్య సహాయం కోసం అందుబాటులోకి వస్తారు. 


- ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 మందికి కోవిడ్ పరీక్షలు చేశాం. 


- ముఖ్యమంత్రి ముందుచూపుతో ఇతర దేశాల నుంచి ర్యాపిడ్ కిట్ లను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారు. 


- చివరికి దీనిపైన కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాకులు, చెవాకులు మాట్లాడాడు. 


- ఐసిఎంఆర్ అనుమతితో జరుగుతున్న పరీక్షలపైన కూడా విమర్శలు చేయడం దారుణం. 


- రాష్ట్ర ప్రజలకు వరప్రదాయినిగా ర్యాపిడ్ టెస్ట్ లతో కోవిడ్ ను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. 


- చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయాలకు తావిస్తూ విమర్శలు చేస్తున్నాడు.