విద్యార్థులకు అందే డ్రై రేషన్ పంపిణీలో  గోల్ మాల్

విద్యార్థులకు అందే డ్రై రేషన్ పంపిణీలో  గోల్ మాల్


,ఎమ్మిగనూరు,ఏప్రిల్,4 (అంతిమతీర్పు): -ఎమ్మిగనూరు నియోజకవర్గమైన గోనెగండ్ల మండలంలో ఉన్న ప్రతి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే డ్రై రేషన్ సరుకులు పక్కదారి పట్టాయని టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు రంగస్వామినాయుడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే జగనన్న గోరుముద్ద కరోనా వైరస్ కారణంగా విద్యార్థులకు మొదటి ఫేస్ కింద మార్చి 31 వరకు ఇవ్వాల్సిన డ్రై రేషన్ సరుకులను  గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డ్రైరేషన్ లో బాగంగా 1460 మంది విద్యార్థులు ఉండగా ఒక్కొక్క  విద్యార్థికి  బియ్యం 750 గ్రాములు,5కోడిగుడ్లు,5చిక్కీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 396 మంది విద్యార్థులకుమాత్రమే  ఒక్కొక్కరికి 5 కోడి గుడ్లు చొప్పునా 1980 గుడ్లు మాత్రమేఇచ్చారనిమిగతాగుడ్లుఅయిపోయాయని,అలాగే కేవలం గుడ్లు మాత్రమే ఇచ్చి 20 కింటాళ్లు బియ్యం,7300 కిచిడీలు విద్యార్థులకు అందాల్సి ఉన్న ఎందుకు పంపిణీ చేయలేదో సమాధానం చెప్పాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇచ్చినా గడువులోగా మీరూ ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ఇచ్చినా గుడ్లు కూడా టీచర్ల పర్యవేక్షణలో ఇవ్వలేదని అన్నారు.ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వలేదో లేక అమ్ముకున్నారోవిద్యార్థులకుతెలియజేయాలనివారు  డిమాండ్ చేశారు.కరోనా వైరస్ కారణంగాతల్లిదండ్రులకు పనులు లేక విద్యార్థులు పెనుభారం అవ్వకూడదని ప్రభుత్వం భావిస్తే, మీరూ అమలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.ఇక రెండవ ఫేస్ డ్రై రేషన్ సరుకులనువిద్యార్థులకు  ఇవ్వాలని ప్రభుత్వం 3న ఉత్తర్వులు ఇచ్చిందని, ఏప్రిల్ 1 నుండి 23 వరకు పనిదినములు 17 రోజులకు గాను 1-5తరగతుల విద్యార్థులకు బియ్యం 1 కిలో 700 గ్రాములు,గుడ్లు 14 చిక్కీలు 9,6-10తరగతుల విద్యార్థులకు బియ్యం 2 కిలోల 550 గ్రాములుగు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image