చెంచు గూడాల ప్రజలను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి  :  ఐఎచ్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు

చెంచు గూడాల ప్రజలను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
   ఐఎచ్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు
గుంటూరు ఏప్రిల్ 25 :రాష్ట్రం లో మానవత్వం మంట కలిసి పోతుందని పేద అణగారిన వర్గాల ప్రజలను ఆదుకొనే నాదుడు కరువైనారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం (ఐఎచ్ఆర్ఏ)ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు ఆన్ధోలన వ్యక్తం చేశారు.కోవిస్-19, (కరోనా) నేపద్యం లో రాష్ట్రం లో పేదప్రజలు తల్లడిల్లి పోతున్నారని,వారికి సరైన సౌకర్యాలు కల్పించడమ్ లో ప్రభుత్వం విఫలమైందని  ఆయన ఆరోపించారు.రెక్కాడితే గాని డొక్కాడని గుంటూరు జిల్లా వెల్దుర్ది మండలం చెంచు గూడెం  ప్రజలు కరోనా మూలంగా అర్ధకలి తో అలమటిస్తున్నారని తిరుపతి నాయుడు తెలిపారు.ఇలాంటి గూడెంలు,తండాలు రాష్ట్రం లో అనేకం ఉన్నాయని అక్కడి ప్రజల పరిస్తితి కూడా ఇలాగే  ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు.లాక్ డౌన్ నేపద్యం లో ప్రభుత్వం పేద ప్రజల కోసం 1000 రూపాయల నగదు  5 కే.జిల  బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు ఇట్టి పతకం ఈ ప్రాంత ప్రజలకు అందక పోవడం శోచనీయమన్నారు.పాటశాలలు ,హస్తల్స్ మూసివేయడం మూలంగా పిల్లలు ఇళ్ల వద్దే ఉండటం మూలంగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదని,కనీసం పట్టణాలకు  వెళ్ళి కొందామన్న కరోన మూలంగా వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా వారికి ఒక వైపు ఉపాడి పనులు లేవు,మరోవైపు పొలం పనులు లేకపోవడం తో చేతిలో డబ్బులు లేక అనేకా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వెంటనే ఈ ప్రాంతాల ప్రజలకు 1000 రూపాయలు, 5 కే.జి ల బియ్యం అందించాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు,ఇట్టి విషయాన్ని అధికారుల  దృస్టికి తెసుకెల్తే వారు కరోనా ఉంది మేము వెళ్లలేము అన్న నిర్లక్ష సమాదానం ఇస్తున్నారని తెలిపారు.పేదల విషయంలో వెంటనే ముఖ్య మంత్రి జగన్ మోహాన్ రెడ్డి స్పందించి వారిని ఆదుకోవాలని తిరుపతి నాయుడు కోరారు.ఈ మేరకు గురజాల ఆర్డిఓ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..