రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం

*27.04.2020*
*అమరావతి*


రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం


*దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌*


*ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల*


*గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లింపు*


*12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు లబ్ది*


నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హమీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మరో పధకాన్ని రేపు ప్రారంభించనున్నారు. దేశచరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పధకం *జగనన్న విద్యాదీవెన* పధకాన్ని రేపు క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పధకాన్ని సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రవేశపెడుతున్నారు. కరోనా కష్టాలు ఉన్నా పెద్ద చదువులు చదువుతున్న విద్యార్ధులకు పూర్తి పీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది.


12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు ఈ పధకం ద్వారా లబ్దిపొందనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్దిక సంవత్సరంలో చెల్లించనున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12,000 కోట్లు ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పధకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా జగనన్న విద్యాదీవెన పధకాన్ని రేపు ప్రారంభించనుంది.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image