ఏపీలో అందుబాటులోకి కరోనా టెస్టింగ్‌ కిట్లు

ఏపీలో అందుబాటులోకి కరోనా టెస్టింగ్‌ కిట్లు
అమరావతి: కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు గౌతమ్‌రెడ్డి, ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌-19 ర్యాపిండ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను సీఎం పరిశీలించారు. కరోనా పరీక్షల కోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలోనే తయారు చేశారు. 
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కిట్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయ్యికిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కిట్ల ద్వారా 50 నిమిషాల్లోనే టెస్టింగ్‌ రిపోర్టు  తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేసేందుకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. ఇంకో వారం రోజుల్లో 10వేల కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యప్తంగా ఇప్పటికే ప్రత్యేక సర్వే చేసిన వైద్యఆరోగ్యశాఖ కొవిడ్‌ లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో దాదాపు 2వేల మందికి పరీక్షలు అవసరమని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా  కరోనా బాధితుల సంఖ్య 329కి చేరిన విషయం తెలిసిందే.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు