శ్రీకాళహస్తిలో ఇళ్లవద్దకే నిత్యావసర వస్తువులు పంపుతున్నాము : చిత్తూరు కలెక్టర్

,ఏప్రిల్ 29...      చిత్తూరు  జిల్లాలో    ఎక్కువ కేసులు నమోదవుతున్న శ్రీకాళహస్తి పట్టణములో కంటైన్మెంట్ జోన్ చేశామని మొత్తం 14 వార్డులలో పాజిటివ్ కేసులు నమోదు అవడం వల్ల మొత్తం 35 వార్డులను  రెడ్ జోన్ లుగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి కి చెప్పారు.బుధవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఇళ్లవద్దకే నిత్యావసర వస్తువులు పంపుతున్నామని ఇందులో 10 మంది వ్యాపారస్తులకు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని అదే విధంగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి,తిరుపతి లోని రుయా ఆస్పత్రిని కోవిద్ ఆస్పత్రులుగా మార్చడం వల్ల ఔట్ పేషెంట్ విభాగం పని చేయడం లేదని ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సి ఉందని అన్నారు.శ్రీకాళహస్తిలో రోజి 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా సెకండ్ కాంటాక్టులను గుర్తిస్తున్నామని అన్నారు.కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి జిల్లాకు 500 జ్వరం కు సంబంధించి చెక్ చేయడానికి ధర్మామీటర్లను  పంపిణీ చేస్తామని అలాగే కోవిద్ ఆస్పత్రులు కాకుండా రెగులర్  పేషెంట్ల కోసం ఏర్పాటు చేస్తామన్నారు.ఆస్పత్రులలో కావాల్సిన ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయో చూసుకొని ఎవరైతే రోగి వస్తాడో వారికి అన్ని వస్తువులు ఉండేటట్లు చూడాలని అన్నారు.ఇవన్నీ మే 5 లోపున ఉండేటట్లు చూసుకోవాలని అన్నారు.ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటామని అంటారో వారికి టేలిమెడిసిన్ పై అవగాహన కల్పించాలన్నారు.అదేవిధంగా వారి ఇంట్లో చిన్న పిల్లలు లేకుండా చేసుకోవడంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కు లివింగ్ స్పేస్ ఉండాలని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.ర్యాపిడ్ టెస్టులను మరింతగా చేయాలన్నారు.డిశ్చార్జ్ చేసేటపుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇతర వ్యాధిగ్రస్థులపై కూడా శ్రద్ధ చూపాలని అన్నారు.వ్యాధిగ్రస్తులు కు పెట్టె ఖర్చులలో నిదులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు ప్రైవేట్ ఆస్పత్రులవారు ఏమెర్జెన్సీ కేసులు చూసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కోరారు.వారు కరోనా తో సంభందించిన కేసులు కాకుండా ఇతర కేసులు చూస్తారని కార్యదర్శి గిరిజాశంకర్  అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తో పాటు జె సి2 చంద్రమౌళి,జిల్లా వైద్యాధికారి పెంచలయ్య,డాక్టర్ జయరాజ్,సరలమ్మ,నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు