జర్నలిస్టుల తొలగింపుపై రిట్‌ పిటీషన్‌ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు


––––––––––––––––––––––––––––––––––
జర్నలిస్టుల తొలగింపుపై రిట్‌ పిటీషన్‌
విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
––––––––––––––––––––––––––––––––––––
        హైదరాబాద్, ఏప్రిల్ 27 :    లాక్‌డౌన్‌ సంక్షోభం సాకుతో జర్నలిస్టులను తొలగించకుండా ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలను ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఏజే, డీయూజే, ముంబై జర్నలిస్టుల యూనియన్, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు సోమవారం విచారణకు స్వీకరించింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సంజయ్‌ కిషన్‌ కౌల్, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తూ రెండు వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాల్సిందిగా ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సాకుతో దేశంలోని వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టులతో సహా పలు విభాగాల సిబ్బందిని తీసివేయడమో, బలవంతంగా రాజీనామా చేయించడమో, వేతనాల్లో కోత విధించడమో, సెలవులపై వెళ్లేలా చేయడమో చేస్తున్నాయని ఫిర్యాదుదారులుగా ఉన్న నేషనల్‌ అలియెన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏజే), ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్‌ (డీయూజే) తదితర సంఘాల నాయకులు ఎస్‌కే పాండే, ఎన్‌.కొండయ్య, సుజాతా ముధోక్, ఇంద్ర కుమార్‌ జైన్, జి. ఆంజనేయులుు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంను కోరారు. పిటీషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గన్సెల్వస్‌ హాజరయ్యారు. సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ పిటీషన్‌ ప్రతిని తనకు అందజేయాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. 
––––––––––––
జి. ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి, ఏపీడబ్య్లుజేఎఫ్, ఏ.అమరయ్య, కె. మునిరాజు కన్వీనర్‌, ఎపీబీజేఏ, శాంతి శ్రీ, కార్యదర్శి ఎన్ ఎ జే,
ఎన్‌.కొండయ్య, ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఏజే
హైదరాబాద్, 
తేదీ 27–04–2019


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు