సీ.ఎం. జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలి : మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు (IJU) డిమాండ్.

 సీ.ఎం. జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలి..


గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్, ప్రధాని మోడీతో మాట్లాడి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.


మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) డిమాండ్.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


✍అనంతపురంలో 2వ రోజు కొనసాగిన జర్నలిస్టుల నిరసన దీక్ష..
______________________________


👉ఏ.పీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు జర్నలిస్టుల సమస్యల సాధన కోసం మచ్చా రామలింగారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 2వ రోజు నిరసన దీక్ష కొనసాగింది.


✍మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు కరోనా వార్తలు సేకరిస్తారని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఒత్తిడి తెచ్చి జర్నలిస్టులకు న్యాయం చేయాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.


✍జర్నలిస్టులకు 50 లక్షల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్  బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, జర్నలిస్టులకు పి.పి.ఈ కిట్లు, మాస్కులు అందజేయాలని కరోనా సహాయ నిధి కింద జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


✍ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సాధించాలని జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని అందరినీ ఆదుకుంటున్న సీ.ఎం జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.


👉2వ రోజు నిరసన దీక్షలో సీనియర్ జర్నలిస్టు వార్త ఇంచార్జ్ జోగేశ్వర్ రెడ్డి, ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టాఫ్ రిపోర్టర్ వేణుగోపాల్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మారుతి, భాస్కర్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శివ ప్రసాద్, సభ్యులు ఆది, దిలీప్, హనుమంత్ రెడ్డి, సాక్షి బాలు, ఆంధ్రజ్యోతి వాలి... జర్నలిస్టులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు.


✍వార్త బ్యూరో ఇంచార్జ్ జోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ పోరాటం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమైయంత వరకు కొనసాగించాలని సూచించారు.. ఇండియన్ ఎక్స్ప్రెస్  వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో నిరసన దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


💎A.P. JOURNALIST DEVELOPMENT SOCIETY💎


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image