హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS


హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
      అమరావతి, ఏప్రిల్ 27 :  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వలు విధించిన లాక్ డౌన్ ను అమలు చేస్తున్న క్రమంలో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ పోలీస్ శాఖ కు చెందిన హర్జీత్ సింగ్ పై కొంతమంది అల్లరిమూకలు దాడి చేసి చేతి మనికట్టును అత్యంత దారుణంగా నరికినప్పటికి గాయాన్ని సైతం లెక్కచేయకుండా అల్లరిముకలను వెంటబడి వారి ఆగడాలను అరికట్టిన హర్జీత్ సింగ్ ధైర్యసాహసాలు పోలీసు వ్యవస్థకు ప్రేరణ,ఆదర్శం, స్ఫూర్తిదాయకం.నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ,ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వైదులకు చేతులెత్తి నమస్కరిస్తున్న ను.
అదే విధంగా 48 గంటలు తిరగముందే తిరిగి అతి కిష్ట్లమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించి అతని చేతిని అతికించి యధాస్థితికి తీసుకొచ్చిన PGI  చండీఘఢ్ వైద్య బృందానికి,వారి నైపుణ్యానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల సలాం.
  కోవిడ్ 19 పై పోరాటంలో భారతదేశానికి  *ఐ కాన్* గా నిలిచిన  ఎస్.ఐ శ్రీ హర్జీత్ సింగ్ కు మద్దతుగా ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారి ఆదేశాల మేరకు రాష్ట్రం లోని అన్ని జిల్లా యూనిట్లకు చెందిన అధికారులు హర్జిత్ సింగ్  పేరుతో *నేమ్ ప్లేట్* ధరించి, హర్జిత్ సింగ్ పోరాట స్ఫూర్తికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహించారు.మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయం లో పలువురు ఉన్నతాధికారులు అడిషనల్ డి‌జిలు హరీష్ కుమార్ గుప్తా IPS, రవి శంకర్ అయ్యనార్ IPS, ఐ.జీలు మహేశ్ చంద్ర లడ్డ IPS, వినీత్ బ్రిజ్ లాల్ IPS, డి‌ఐజి, రాజశేఖర్ బాబు IPS మరియు ఎస్‌పిలు ఐశ్వర్యరాస్తొగి IPS, వెంకతారత్నం ఆధికారులు హర్జిత్ సింగ్  పేరుతో *నేమ్ ప్లేట్* ధరించి విధులకు హాజరైయ్యారు.IAM HARJEET SINGH ప్లే కార్డ్ ను ప్రదర్శించారు.


 


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image