వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
ఏప్రిల్ 5
.
పార్టీ ఎమ్మెల్యే శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్
- కరోనాను ఎదుర్కోనేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతోంది.
- ప్రస్తుతం దేశంలో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది.
- దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చాలా కష్టాల్లో ఉన్నాయి.
- కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలనేదే సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష్యం.
- రాత్రి 9 గంటలకు క్యాoడిళ్లు, దీపాలు వెలిగించి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలన్నదే ప్రధాని ఉద్దేశ్యం.
- వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజల కోసం సేవలందిస్తున్నారు.
- విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
- ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు అడ్డగోలుగా ట్వీట్లు చేస్తున్నారు.
- చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయి.
- బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నామని అంటున్నారు.
_ ఈ డబ్బు నరేంద్ర మోడి గారిదో,శ్రీ జగన్ గారి గా కాదు ప్రజల డబ్బు.
- కోటి 33 లక్షల పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.1000 వాలంటీర్ల ద్వారా అందజేసింది.
- అవినీతి జరిగినట్లు ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది.
- రూ.1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా ఓ వీడియో పెట్టారు.
- కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి.
- ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారనే టీడీపీ కడుపుమంట.
- 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసింది.
- ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు నిధులు విడుదలయ్యాయి.
- ఏపీకి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు.