ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

*26.04.2020*
*అమరావతి*


*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.


*రాష్ట్ర వ్యాప్తంగా కొసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌*   


*రాష్ట్రంలో 1097 పాజిటివ్‌ కేసులు:*


రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 6768 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 1097 కు చేరింది. 
 కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 214, కృష్ణా జిల్లాలో 177, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 72, వైయస్సార్‌ కడప జిల్లాలో 58,  ప్రకాశం జిల్లాలో 56, అనంతపురం జిల్లాలో 53, పశ్చిమ గోదావరి జిల్లాలో 51, తూర్పు గోదావరి జిల్లాలో 39, విశాఖపట్నం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.
 కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 31 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో 29 మంది చొప్పున, వైయస్సార్‌ కడప జిల్లాలలో 28 మంది,  ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 23 మంది చొప్పున, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, అనంతపురం జిల్లాలలో 14 మంది, చిత్తూరు జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది.. మొత్తం 231 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
 ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నారు.
 మరోవైపు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.  


*కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:*


కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనకు ఫోన్‌ చేసిన విషయాన్ని అధికారులకు తెలియజేసిన సీఎం.
ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై చర్చ.
లాక్‌డౌన్‌ పరిణామాలు, దీని తర్వాత అనుసరించిన వ్యూహాలపై చర్చ.
రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
రాష్ట్రంలో విస్త్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన సీఎం.
ప్రతి మిలియన్‌ జనాభాకు 1274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్న సీఎం.


గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై చర్చ


గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఇక్కడకు రప్పించడంపై ఇప్పటికే తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కోవిడ్‌–19 నివారణా చర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌తో ఫోన్‌లో మాట్లాడానన్న సీఎం. 
 రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సతీష్‌చంద్ర చూసుకుంటారంటూ తాను కేంద్ర మంత్రికి తెలియజేశానని, ఆ మేరకు ఆమె కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారని తెలిపిన సీఎం.


*జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:*


*శ్రీకాకుళం జిల్లా:*


జిల్లాలో ఇప్పటి వరకు 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3576 శాంపిల్స్‌ నెగటివ్‌గా తేలాయని ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) తెలిపారు. జిల్లాలో తొలిసారిగా కోవిడ్‌–19 కేసులు నమోదు కావడంతో ఆదివారం అక్కడ పర్యటించిన ఆయన, పరిస్థితిని సమీక్షించారు. కరోనా పాజిటివ్‌ గుర్తించిన వారికి జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ఈ వ్యాధి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
 జిల్లాకు విదేశాల నుంచి 1445 మంది రాగా, వారితో 4271 మంది కాంటాక్ట్‌ అయ్యారని, అలాగే ఢిల్లీ నుంచి 230 మంది, ముంబై నుండి మరో 488 మంది వచ్చారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలిందని, ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి, జిల్లాల వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
 నిత్యావసరాల కోసం ఇంటి నుంచి కేవలం ఒక్క మనిషి మాత్రమే  బయటకు రావాలని, అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు. 
 జిల్లాలో కరోనా వైరస్‌ పరీక్షల కోసం ల్యాబ్‌ ఏర్పాటు చేశామని, ఇంకా ర్యాపిడ్‌ కిట్స్, ట్రూనాట్‌ కిట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని, వీటన్నింటి ద్వారా ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు జిల్లాలోనే నిర్వహిస్తామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. జెమ్స్‌ ఆస్పత్రిని జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చి, తగిన ఏర్పాట్లు చేశామని, ఇంకా 32 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటిలో పూర్తి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రాలలో ప్రతి ఒక్కరిపై రోజుకు రూ.500 వ్యయం అవుతాయని తెలిపారు.
 జిల్లాలో పాతపట్నం ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించడమే కాకుండా, ముందు జాగ్రత్తగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలోకి ఇతర ప్రాంతాల వారు ప్రవేశించకుండా నిరోధిస్తామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 


*విజయనగరం జిల్లా:*


కరోనా కాటుకు బలై రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో విజయనగరం జిల్లా మాత్రం నేటికీ సురక్షితంగానే ఉంది. దీనివెనుక జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ పకడ్బందీ వ్యూహం, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తగిన అధికార యంత్రాంగం తోడ్పాటు ఉన్నాయి. జిల్లాను సేఫ్‌గా ఉంచడంలో కలెక్టర్‌కు వివిధ శాఖలు పూర్తి అండగా నిలుస్తున్నాయి. అందరినీ సమన్వయం చేయడంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ నేతృత్వంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కీలకపాత్ర పోషిస్తోంది.
       రాష్ట్రంలో కరోనా తొలి కేసు బయట పడగానే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కేతన్‌ ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించింది.  జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు కేతన్‌ పలు ప్రత్యేక కార్యక్రమాలను ఈ సెంటర్‌ ద్వారా అమలు చేస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సారధిగా  డేటా సేకరణ, విశ్లేషణకు ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చి,  దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి పనితీరుకు వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆలోచనలను పసి గట్టి, జిల్లా అవసరాలకు తగినట్టుగా వాటిని అన్వయించి,  ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఇప్పటివరకు మంచి ఫలితాలను రాబట్టారు.
       జిల్లాలో కరోనా కట్టడిలో సత్ఫలితం ఇచ్చిన ఏడంచెల వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నది కూడా ఈ కంట్రోల్‌ రూమ్‌ ద్వారానే. ఈ కేంద్రం ద్వారా సర్వైలెన్స్, కాల్‌ సెంటర్‌ మానిటరింగ్, డేటా విశ్లేషణ,  పోలీసులతో సమన్వయం,  జిల్లాలోని కోవిడ్‌ ఆసుపత్రుల్లో సన్నద్ధతను పర్యవేక్షించడం, అలాగే పౌరసరఫరాల వ్యవస్థ పనితీరును గమనించడం, కరోనా నియంత్రణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, వాటికి సంబంధించిన నివేదికలను కూడా తయారు చేయడం కమాండ్‌ కంట్రోల్‌ రూము ముఖ్య విధులుగా చెప్పవచ్చు.
 ఇంకా ఇంటింటి కుటుంబ ఆరోగ్య సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలను విశ్లేషిస్తూ,  కొత్తకొత్త ప్రణాళికలను రూపొందించడంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ తెరవెనుక చేస్తున్న కృషి కూడా ఎంతో ఉంది.  ఇంటింటా నిర్వహించిన సర్వేలో డేటాను విశ్లేషించడం,  అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడం, అవసరమైన వారికి నిర్ధారణా పరీక్షలు నిర్వహించడం, నివేదికలను తయారు చేసి, జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించడం తదితర కీలక కార్యక్రమాలన్నీ కమాండ్‌ కంట్రోల్‌ రూము ద్వారానే జరుగుతున్నాయి.


*పశ్చిమ గోదావరి జిల్లా:*


కరోనా వైరస్‌కు ధనిక, పేద, వర్గ విభేదాలు లేవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జిల్లాలోని కొవ్వూరులో 2 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, అందువల్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. కంటికి కనిపించని వైరస్‌తో మనం పోరాడుతున్నామని, కన్ను మూసి తెరిచే లోపు వైరస్‌ వ్యాపిస్తోందని, చివరకు అది శరీరంలో చేరినా వెంటనే బయట పడదని గుర్తు చేశారు. తాజాగా కొవ్వూరులో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా ప్రజలు భయపడాల్సిన పని లేదని, అయితే ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. 
 కరోనా వైరస్‌ నియంత్రణ, నివారణ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోరాడుతోందని, అయితే ప్రజల సహకారం ఎంతో అవసరమని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో మరింత చొరవ చూపాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, ఎక్కడైనా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఆస్పత్రిలో చేరాలని కోరారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ రావాల్సి వస్తే మాస్కు ధరించాలని, బహిరంగ ప్రదేశాలలో భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని మంత్రి తానేటి వనిత ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


*కృష్ణా జిల్లా:*


జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న విజయవాడ నగరంలో కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్, నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు పర్యటించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా కొంత మంది పోలీసులు, వాహనాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. 
 విజయవాడలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. నగరంలో ముఖ్యంగా కృష్ణలంక, కార్మికనగర్, ఖుద్దూస్‌నగర్‌ ప్రాంతాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ఆ ప్రాంతాల్లో యథేచ్ఛగా సామూహిక సమావేశాలు నిర్వహించడం వల్లనే వైరస్‌ వేగంగా వ్యాపించిందని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్‌ సోకిందని, అందువల్ల ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
 జిల్లాలో 7,500 మందికి పరీక్షలు చేస్తే 170 మందికి పాజిటివ్‌ వచ్చిందన్న అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృథాయే అని స్పష్టం చేశారు. విజయవాడలో ఇప్పటికే 150 కి పైగా పాజిటీవ్‌  కేసులు వచ్చాయని, అందువల్ల కరోనా వైరస్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు కోరారు.
 నగరానికి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తితో పాటు, మరో లారీ డ్రైవర్‌ ద్వారా కేసులు భారీగా పెరిగాయని సీపీ వెల్లడించారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఆ ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్న సీపీ, ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని, ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఊర్కోబోమని హెచ్చరించారు. నగరంలోని అంతర్గత మార్గాలలో ప్రజల రవాణాపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడతామన్న పోలీస్‌ కమిషనర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


*ప్రకాశం జిల్లా:*


రాష్ట్రంలో కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అన్ని చర్యలు తీసుకున్నారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఆదివారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకము మండలం, గొల్లపల్లిలో నిరుపేదలకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్న మంత్రి, నిరుపేదలకు ఇప్పటికే రెండు పర్యాయాలు బియ్యం, పప్పులతో పాటు, రూ.1000 నగదు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
 రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న మంత్రి ఆదిమూలపు సురేష్, రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంతో పాటు, వాటి మార్కెటింగ్‌ కోసం రైతు భోరాసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు సగటు రోజు కూలీ రూ.232 గిట్టుబాటు అవుతుందన్న మంత్రి, కూలీలు పని చేసే సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు.


*చిత్తూరు జిల్లా:*


లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో జిల్లాకు వలస వచ్చి చిక్కుకుపోయిన వారికి జిల్లా యంత్రాంగం ఆపన్న హస్తం అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 26 రిలీఫ్‌ క్యాంపుల్లో 2,091 మంది వసతి పొందుతున్నారు. వాటిలో చిత్తూరులో–7, తిరుపతిలో–5, మదనపల్లెలో–2, వాల్మీకిపురంలో–1, యాదమరిలో–1, బంగారుపాళ్యంలో–1, శ్రీకాళహస్తిలో–1, చంద్రగిరిలో–1, రేణిగుంటలో–2, పలమనేరులో–1, కలికిరిలో–1, పుంగనూరులో–1, ఐరాలలో–1, కలకడలో–1 ఉన్నాయి.
 ఆయా వసతి గృహాల్లో రాష్ట్రానికి చెందిన వారితో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మాహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, హరియాణ, సిక్కిం, గుజరాత్, నేపాల్, పంజాబ్‌కు చెందిన వలస కార్మికులున్నారు. వారికి ఆయా కేంద్రాలలో బస, భోజన సౌకర్యంతో పాటు, శానిటైజర్లు, మాస్కులు ఇచ్చారు. 
 ఇంకా ఆహ్లాదకర పరిస్థితి, ఆరోగ్యం కోసం యోగా అభ్యాసం చేయిస్తున్నారు. ఉత్తరాది వంటకాలను అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు పాలు, గుడ్లు, పండ్లు అందజేస్తున్నారు. 


*అనంతపురం జిల్లా:*


కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 పై ఆయన నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. హిందూపురంలో పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఏ ఒక్క కాంటాక్ట్‌ మిస్‌ కాకుండా ట్రేస్‌ చేస్తున్నామని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు సంబంధించి అందరితో శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎంత మంది కాంటాక్ట్లను సేకరించారు, ఇంకా ఎంతమంది కాంటాక్ట్లను సేకరించాలి అనే వివరాలను అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. 
 హిందూపురంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులు ఎలా, ఎందుకు కాంటాక్ట్‌ అయ్యారు అనే వివరాలను పక్కాగా ట్రేస్‌ చేయాలని, అప్పుడే పూర్తిస్థాయిలో కాంటాక్ట్‌ ట్రెసింగ్‌ చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. కేరళ, సౌత్‌ కొరియాలో కరోనా వైరస్‌ అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి 70 శాతం మేర కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పూర్తి చేశామని, పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.
 అలాగే క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలని సంబంధిత నోడల్‌ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న ముస్లింలకు రంజాన్‌ మాసం సందర్భంగా డ్రై ఫ్రూట్స్, పండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఇప్పటి వరకు ఎంత మందిని ఇంటికి పంపించారు.. అనే వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. స్థానిక తహశీల్దార్లతో పాటు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వివరాలు వేగంగా సేకరించేందుకు పుట్లూరు, యల్లనూరు, యాడికి, కదిరి, సింగనమల తహసీల్దార్లను కూడా అదనంగా నియమించాలని ఆదేశించారు. 
 మరోవైపు రెడ్‌జోన్లలో పని చేసే వారి కోసం 6 వేల పీపీఈ కిట్లు, 4 వేల మాస్కులు, 3 వేల శానిటైజర్లు, 4 వేల గ్లౌజులను కలెక్టర్‌ గంధం చంద్రుడు హిందూపురం మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్‌తో పాటు, పలువురు సీఐలను అందజేశారు.  
 
*వైయస్సార్‌ కడప జిల్లా:*


కడప ముస్లిం అసోసియేషన్‌ కువైట్‌ (కెఎంఎకె) సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బి. అంజాద్‌ బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కెఎంఎకె అధ్యక్షుడు గఫార్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అల్మాస్‌ ఫంక్షన్‌ హాలులో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ కడప ముస్లిం అసోసియేషన్‌ కువైట్‌ సంస్థ గత ఏడేళ్లుగా కడపలో పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రశంసించారు.
 పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన సమయంలో 200 పేద కుటుంబాలకు నెలకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గతంలో ప్రతి ఏడాది 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయగా, ఈసారి ఆ సంఖ్య తగ్గిందని, అందుకు కరోనా వైరస్‌ కారణమని చెప్పారు. దాదాపు 40 రోజుల నుంచి లాక్‌డౌన్‌ ఉండడం వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ఎందరో దాతలు కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని మంత్రి అంజాద్‌ బాషా పేర్కొన్నారు. 


*కర్నూలు జిల్లా:*


జిల్లాలో కరోనా కట్టడి కోసం తొలి నుంచి జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అమలు చేస్తున్న కర్నూలు ఫైట్స్‌ కరోనా ప్రణాళికను ఇక నుంచి ‘ఆపరేషన్‌ కర్నూలు ఫైట్స్‌ కరోనా‘ పేరుతో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కోవిడ్‌ స్టేట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ మరియు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అజయ్‌జైన్‌ వెల్లడించారు. జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను ఆయన ఆదివారం సమీక్షించారు. కర్నూలు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ మీటింగ్‌ హల్లో కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, ఇతర ఉన్నతాధికారులతో అజయ్‌జైన్‌ సమావేశమయ్యారు. 
 కరోనా పాజిటివ్‌ కేసు వచ్చిన వెంటనే వారికి సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టస్‌ను వేగంగా ట్రేస్‌ చేయడం, క్వారంటైన్‌లో పెట్టడం,  టెస్టింగ్‌ చేయించడం, కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ మైక్రో బయాలజీ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌టి–పిసిఆర్‌ ల్యాబ్‌తో పాటు, హైదరాబాద్‌ అపోలో, విమ్టా, తిరుపతి స్విమ్స్‌ ల్యాబ్‌ల నుంచి వేగంగా రిజల్ట్స్‌ తెప్పించడం, వెంటనే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులలో  ఐసోలేషన్‌ ట్రీట్మెంట్‌ చేయించడం,  ట్రాకింగ్‌ చేయడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.


Popular posts
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి