నిన్న కృష్ణలంక బాటలో.....నేడు జక్కంపూడి కాలనీ : జర్నలిస్ట్ యేమినేని వెంకటరమణ

*ఈ కరోనా మరణ మృదంగాన్ని ఆపేదెవరు*


*మరో ధారవి కానున్న జక్కంపూడి కాలనీ*


*అధికారులను పరుగులు తీయిస్తున్న కరోనా కేసులు*


*నిన్న కృష్ణలంక బాటలో.....నేడు జక్కంపూడి కాలనీ*


విజయవాడ. ఏప్రిల్...28
 ఇందుకలదు అందలేదు ....ఎందెందు వెతికినా అందునే కలదు అన్న చందంగా నేడు కరోనా కేసులు లేని ప్రాంతాలు లేకుండా పోయింది ....సుమారు 40 వేలమంది నివసిస్తున్న జక్కంపూడి కాలనీలో కరోనా కోవిడ్ 19 వైరస్ కేసు నమోదైంది ........
కృష్ణలంకలో కరోనా నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక బలగాలతో కవాతుకూడా నిర్వహించారు.. జులాయిగా తిరుగుతున్న యువకులు క్వారెంటెయిన్ సెంటర్లోకి తరలించారు.....
తెల్లారేసరికి జక్కంపూడి కాలనీలో కరోనా కేసు బయట పడింది  వందలాది కుటుంబాలు నివసిస్తున్న కాలనీలో ఇల్లు ,మెట్లు ,ఇరుకిరుగ్గా ఉన్నాయి  పైగా కరోనా బాధితుడు టీ అమ్మేవాడు .
కాలనీలో ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముతుండేవాడు ..అంతేగాకుండా  అతను ఆటోనగర్, శ్రామికనగర్, సనత్ నగర్ ,తదితర ప్రాంతాల్లో కూడా టీ అమ్మి జీవిస్తున్నాడు 
సనత్ నగర్ లో అతనికి ఈ అంటువ్యాది అంటుకొందని అధికారులు భావిస్తున్నారు..
అతను తిరిగిన ,టీలు అమ్మిన ప్రాంతాల్లో అతని టీ తాగిన వారందరి వివరాలు సేకరించడం అధికారులకు అగ్నిపరీక్షే ......ప్రపంచంలోనే అతి పెద్దదయిన 
ముంబైలోని ధారవి మురికివాడ లాగా విజయవాడలో జక్కంపూడి కాలనీ కూడా స్లమ్ ఏరియనే......అలాంటి చోట కరోనా కేసులు నమోదయ్యాయంటే  దాని విజృంభణ ఇకముందు భయానకమే .......
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ,అధికారులు ,అన్ని శాఖలు నిర్విరామంగా శ్రామిస్తుంటే బాధ్యత భయం లేకుండా ప్రజలు తిరుగుతూనే వున్నారు ....
ఇక బెజవాడకు మూడిందే........సిగరెట్లు కోసం టీ కోసం ...టైమ్ పాస్ కోసం  యువకులు రోడ్డుపై తిరుగుతూనే వున్నారు .......
పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతున్నారు  ....పేకాట ఆడి ఒకడు ....అష్టాచెమ్మా ఆడి మరోమహిళ, టీలు అమ్ముకోడానికి తిరిగి నేడు మరొకరు ...ఇలా ఇలా వ్యాధిని ఒకరినొకరు అంటించుకొంటూపోతే  కరోనా ఎలా నియంత్రణకు వస్తుంది ........
పోలీసులు, వైద్యులు, నర్సులు ,పారిశుద్ధ్య కార్మికులు, కరోనా బారిన పడుతున్నారు... ఐనా ...వారు విధులు నిర్వహిస్తున్నారు.....
వారందరు విసుగుతో  విధులు నిర్వహించే బాధ్యత విస్మరిస్తే...
ఒక్కసారి ఆలోచించండి .......ఊహకే భయంకరమైన వణుకుపుడుతుంది .
కరోనా కేసులు మూడంకెలుకు  చేరుకొంది ..నగరంలో లక్షలాదిమందికి సోకకుండా ఎవ్వరికి వారు స్వీయనియంత్రణ తో ఇంటినుండి బయటకు రాకుండా కరోనా విస్తరించకుండా నగరాన్ని కాపాడుకోలేమా.....
ఇంటిబయటకు రాకండి  కరోనాని ఇంట్లోకి తేకండి ..
అధికారులకు సహకరించండి  మనల్ని మనం కాపాడుకొంటూ మన కుటుంబాన్ని  కాపాడుకొంటూ , తద్వారా నగరాన్ని ,జిల్లాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోలేమా...
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సూచనలు పాటిద్దాం ..కరోనా కోవిడ్ 19 మహమ్మారిని  తరిమికొట్టాలి...... దానిగ్గను ..మనమేమి చెయ్యాల్సిన పనిలేదు...... ఇల్లు వదిలి బయటకు రాకుండా ఉండడమే........ఇట్లు..... యేమినేని వెంకటరమణ ......ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ..నగర ప్రధాన కార్యదర్శి .......


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image