యూనిఫారం పైన హర్జిత్ సింగ్ పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసిన డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ

పంజాబ్ రాష్ట్ర ఏఎస్ఐ హర్జీత్ సింగ్ కి సంఘీ భావంగా, గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ  యూనిఫారం పైన హర్జిత్ సింగ్ పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసినారు.
 దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదించిన లాక్ డౌన్ ను ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా పటిష్టంగా నిర్వహిస్తున్న సందర్భంలో, పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు చూపించాలని అడగటంతో వారు పోలీసులపై దాడికి తెగబడ్డారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హర్జీత్‌ సింగ్‌ చేతిని కత్తితో నరికారు.  మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ASI ని చండీఘడ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల బృందం చేసిన సర్జరీలో తెగిపోయిన చేతిని డాక్టర్లు తిరిగి అతికించారు. మహమ్మారి ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి లాక్ డౌన్ విధులు నిర్వ హిస్తున్నారు. మండుటెండుల్లో డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని అడ్డు కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసుల పైన, వైద్యుల పైన, ఇతరుల పైన దాడులు జరుగు తున్నాయి. ఈ సందర్భంగా ఇట్టి చర్యలను ఖండిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది.