ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ –19 నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి: ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు ) : కోవిడ్‌ –19 నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితర అధికారులు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి


గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశంపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం
రవాణా ఖర్చులు, భోజనం, దారిఖర్చులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించిన అధికారులు
4,065 మందికిపైగా స్వస్థలాలకు బయల్దేరారని వెల్లడించిన అధికారులు
మత్స్యకారులు తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశం


రాష్ట్రంలో నమోదైన కేసులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష
గడచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని వెల్లడి
గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నర్సరావుపేట నుంచే వచ్చాయన్న అధికారులు
అక్కడ పెద్ద ఎత్తున కంటైన్‌ మెంట్‌చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
రాష్ట్రంలో పాజిటివిటీ శాతం 1.51శాతం అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ కేసులు 3.84శాతంగా ఉందన్న అధికారులు
గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామని తెలిపిన అధికారులు
ఇందులో 70శాతం వరకూ పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామన్న అధికారులు
ఇప్పటివరకూ 88,061 పరీక్షలు చేశామని, ప్రతి మిలియన్‌కు 1649 పరీక్షలు చేశామన్న  అధికారులు


క్లస్టర్ల వారీగా కూడా వెరీ యాక్టివ్,  యాక్టివ్, డార్మంట్‌  క్లస్టర్లు గుర్తించామన్న అధికారులు
గడచిన 5 రోజుల్లో కేసులు నమోదైన క్లస్టర్లను వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా పరిగణిస్తున్నామన్న అధికారులు. వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 76
5 నుంచి 14 రోజులుగా కేసులు లేని యాక్టివ్‌ క్లస్టర్లు 55 
14 నుంచి 28 రోజులుగా కేసులులేని డార్మంట్‌ క్లస్టర్లు  73
28 రోజులనుంచి కూడా కేసులు లేని క్లస్టర్లు 13 
మరింత ఫోకస్‌గా పనిచేయడం కోసం ఈవిశ్లేషణను కలెక్టర్లకు అందిస్తామన్న  అధికారులు


శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభం అయ్యాయని సీఎంకు వెల్లడించిన అధికారులు
ఒంగోలులో ల్యాబ్‌ ఏర్పాటు చర్యలుకూడా ప్రారంభమయ్యాయని వెల్లడి
నెల్లూరులో కూడా ల్యాబ్‌ ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది
శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్న అధికారులు
ఇప్పటివరకూ 8 జిల్లాల్లో 9 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయన్న అధికారులు
ఇవికాక ప్రతి ఏరియా ఆస్పత్రి, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సుమారు 50 చోట్ల ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయి
డీఆర్డీఓతో మాట్లాడి మొబైల్‌ ల్యాబ్‌ను కూడా తయారు చేయిస్తున్నామని వెల్లడి


టెలిమెడిసిన్‌ పరీక్షపై సీఎం నిశిత పరీక్ష
ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం టెలిమెడిసిన్‌కు కాల్‌చేసిన వారికి అదేరోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు
టెలిమెడిసిన్‌ వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలు చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామన్న అధికారులు
మందులు వెళ్లాయా? లేదా? అన్నదానిపై పూర్తిగా అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్న అధికారులు
జిల్లాకు ఏర్పాటుచేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలన్న సీఎం
టెలిమెడిసిన్‌కు సంబంధించి సరైన ఎస్‌ఓపీని రూపొందించుకోవాలన్న సీఎం
పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి... టెలిమెడిసన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం


కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలపై సీఎం ఆరా
ఇప్పటివరకూ 12,247 పరీక్షలు చేశామన్న అధికారులు
మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలన్న సీఎం
మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్న అధికారులు 


వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే ఏ పంటలోనైనా రైతుల వద్దనుంచి ఎక్కువే కొనుగోలు చేశామన్న సీఎం
గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామన్న సీఎం
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయన్న అధికారులు
ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతిద్వారా కొనుగోలు తదితర చర్యలతో ముందుకు సాగుతున్నాయన్న అధికారులు
అరటి, టొమాటో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టిపెట్టాలన్న సీఎం
చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలన్న  సీఎం
గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశం
ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటిద్వారా కూరగాయలను పంపిస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించిన అధికారులు
రెడ్‌జోన్లకు చేరువగా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగాలన్న సీఎం. పాల్గొన్న సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఇతర ఉన్నతాధికారులు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image