సమైక్యంగా కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కోడదాం

*సమైక్యంగా కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కోడదాం


*ఇంట్లోనే ఉండండి...క్షేమంగా ఉండండి*   


       గూడూరు ఏప్రిల్ 9:  లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు, నిరాశ్రయులకు  చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ*


*9వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం దాతగా మీనిగాల విజయ్ కుమార్*


*క్లిష్ట సమయంలో పోలీసుల సేవలు మరువలేనివి*


*కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో అన్ని వర్గాల ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారని ఈ కష్ట కాలంలో చేగువేరా ఫౌండేషన్ అభాగ్యులకు అండగా నిలవడం అభినందనియమని గూడూరు రెండో పట్టణ ఎస్. ఐ ఆదిలక్ష్మి,హోమియే పతి వైద్యులు మీనిగల విజయకుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ ల ఆధ్వర్యంలో ఒరిస్సా కార్మికులకు,ఉపాధి లేక సతమత మవుతున్న ప్రజలకు ఆహారం పంపిణీ కార్యక్రమం విజయ వంతంగా జరుగుతోంది.9వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది.కరోనా వ్యాప్తి నివారణ,లాక్ డౌన్ విధులలో వున్న పోలీసులకు ,ఉపాధి లేక ఇళ్లలో ఉన్న పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్.ఐ ఆదిలక్ష్మి,కార్యక్రమం దాత మీనిగ ల విజయ కుమారులు మాట్లాడుతూ పేద వర్గాల ప్రజలకు చేగువేరా ఫౌండేషన్ అందిస్తున్న సేవలు సమాజ ఉన్నతికి తోడ్పడుతున్నాయన్నారు.. సురేష్ బాబు మాట్లాడుతూ  వైయస్అర్ కాంగ్రెస్స్ పార్టీ, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కష్ట కాలంలో ప్రజలకు అండగా వున్నారని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.కరోనా నివారణ చర్యల్లో పోలీసుల సేవలు ఎన్నటికీ మరువలేమన్నరు.జగనన్న పిలుపుతో కోవిడ్-19 కారణంగా ఉపాధి లేక సతమత మవుతున్న బాధితులకు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనునిత్యం ఆహార పంపిణీ జరగుతోందన్నారు.లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి చవటపాలెం,చిల్లకూరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా ఆహారం అందిస్తున్నామన్నారు.కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కవ అయినందున ప్రజలు అధికార యంత్రాంగం తెలిపిన సూచనలు పాటించి జాగ్రత్త పడాలనీ సూచించారు.ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చేగువేరా టీమ్ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు.ఈ కార్య కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్‌. మదురెడ్డి,ఆన్సర్ భాష,నరేష్ రెడ్డి మరియు పైలట్ టీమ్ వినోద్,పవన్,భాస్కర్,అజయ్, సంతన్, సాయి మహేష్,లక్ష్మి నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు*


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు