రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి: అమలాపురం డీఎస్పీ మాసూమ్ భాషా 

రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి:డీఎస్పీ మాసూమ్ భాషా 
అమలాపురం :. డీఎస్పీ మాసూమ్ భాషా 
 నిబంధనలకు అనుగుణంగా రంజాన్ నిర్వహించు కోవాలని డీఎస్పీ మాసూమ్ భాషా అన్నారు. 
రాజోలు సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న  ముస్లిం పెద్దలతో  నగరం  పోలీస్ స్టేషన్ లో  డిఎస్పీ మాసూమ్ భాషా  సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసాన్ని  ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో నిబంధనలు పాటిస్తూ చేసుకోవడం  సమాజం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసాలు,మరియు నమాజులు చేసుకోవడం మన కర్తవ్యం అని డీఎస్పీ అన్నారు. అదే విధంగా నమాజులు ప్రార్ధనలు అందరూ తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలని మీకు ఎటువంటి సమస్య వచ్చిన  పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా లో ముస్లిం లను కించపరిచే విధంగా పోస్ట్ లు "ఫేక్ వీడియో"లు పెట్టే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలియచేసారు. మే 3 తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షల సడలింపును కమిటీలకు తెలియచేస్తానని తెలిపారు.
మనందరం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నామని అందువలన అందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించాలని కోరారు.
. ప్రతి మస్జీద్ లో ఆజాన్ ఇచ్చుటకు మరియు ఉపవాస సైరన్ మ్రోగించుటకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 
 ప్రతి మస్జీద్ లో ఇమామ్,మౌజన్ మరియు ఇంకొకరికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని అమలాపురం DSP  మాసూమ్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజోలు CI దుర్గా శేఖర్ రెడ్డి,  నగరం SI సతీష్ పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image