దయచేసి ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు రావద్దు : ఎమ్మెల్యే  విజ్ఞప్తి

దయచేసి ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు రావద్దు : ఎమ్మెల్యే  విజ్ఞప్తి
మంత్రాలయం,ఏప్రిల్, 18 (అంతిమతీర్పు):- మంత్రాలయం నియోజకవర్గం ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా దయచేసి బయటకు రావద్దని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర సర్కిల్ లో యూపీఎల్ కంపెనీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు అశోక్ ఆనంద్ రెడ్డి, మండల ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి ఏర్పాటు చేయించిన ప్రత్యేక మిషన్ ద్వారా పిచికారి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజు, రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుప్రక్కల మండల, గ్రామీణ ప్రాంత ప్రజలు  అత్యవసరమైతే తప్పా,ఎవరు కూడా అనవసరంగా  బయటకు రాకూడదనిఅధికారులు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటించాలనివారు కోరారు.అనంతరంరెవెన్యూ,వైద్య,పంచాయతీకార్యదర్శులకి యు పి ఎల్ వారి కంపెనీ తరపున హెల్మెట్ లను అందజేశారు. అనంతరం యూపీఎల్ కంపెనీ వారికి మండల అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీపురెడ్డి, మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, నాయకులు రాఘవేంద్ర రెడ్డి తహసీల్దార్ చంద్ర శేఖర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుబ్బరాయుడు, ఈవోపీఆర్డి నాగేష్, ఎస్ఐ ఎర్రన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ టి.భీమయ్య, ఎంపిటిసి సభ్యులు రాఘవేంద్ర, వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..