ముఖ్యమంత్రికి అవగాహన కల్పించని సలహాదార్లు రాజీనామా చేయాలి:   వర్ల రామయ్య డిమాండ్ 


కరోనాపై ముఖ్యమంత్రికి అవగాహన కల్పించని సలహాదార్లు రాజీనామా చేయాలి:  
: వర్ల రామయ్య డిమాండ్ 
కరోనా వైరస్ తీవ్రతపై సీఎం జగన్ కు అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వ సలహాదార్లు రాజీనామా చేయాలని తెదేపా ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ``కరోనా వైరస్ చిన్నపాటి జ్వరం వస్తుంది, పోతుంద’’ని ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంతుంటే సలహాదార్లు ఏ పుట్టలో దాగారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాపై  అవగాహనా రాహిత్యంతో చేసిన  ప్రకటనతో ప్రపంచమంతా నివ్వెరపోయిందని వర్ల పేర్కొన్నారు. ``కరోనా, మనం కలిసి,మెలిసి జీవించాలి’’అని జగన్ తేలిగ్గా తీసుకుంటే మరి దేశ ప్రధానికి, ఇతర  ముఖ్యమంత్రులకు ఈ విషయాలు తెలియవా? అని నిలదీశారు. కరోనాపై అవగాహనా లేక ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలను కంఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. కరోనా సాదాసీదా జ్వరంలాంటిదైతే ఇప్పటివరకూ ప్రపంచ దేశాల్లో 2,07,254 మంది ఎందుకు మృత్యువాత పడ్డారో వైకాపా నేతలు సమాధానమివ్వాలన్నారు. కరోనా వ్యాప్తికి తెదేపా స్లీపర్ సెల్స్ కారణమని మంత్రి మోపిదేవి ఆరోపించడం, బయటకు వస్తే కోరంటైన్ కు పంపుతామని డీజీపీ గౌతమ్ సావంగ్ హెచ్చరించడం ఎందుకని నిలదీశారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడినదానికి భిన్నంగా మంత్రి, డీజీపీల ప్రకటనలు ఉండటంతో ప్రజల్లో గందరగోళ స్థితి నెలకొందన్నారు. ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న  కరోనా వైరస్ తో ``సహజీవనం చేయాలని’’ ముఖ్యమంత్రి జగన్ తేలిగా తీసుకుని మాట్లాడుతుంటే అవగాహన కల్పించలేని సలహాదార్లు  ఏ పుట్టలో దాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ``మన వారు ‘’ అనే ఆలోచన విడనాడి  ప్రపంచంలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలిసి సలహాలిచ్చే వివేకవంతులను నియమించుకోవాలని సూచించారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image