నేటి నుుండి వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం”ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్.

*24.04.2020* 
*అమరావతి* 


*లాక్ డౌన్ తో వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న పొదుపు సంఘాలకు చేయూత*


*జీవనోపాధికి తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఊరట*


*కరోనా కష్టసమయంలో "వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం" తో భరోసా*



*వడ్డీభారం రూ.1400 కోట్లను పూర్తిగా భరించనున్న ప్రభుత్వం.*



*నేటి నుుండి “వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం”ను ప్రారంభించనున్న సీఎం     వైఎస్ జగన్.



*వడ్డీ రాయితీ లాంఛనంగా బ్యాంకులకు జమ.* 


*రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపుసంఘాల మహిళలకు లబ్ధి.* 


*గత ప్రభుత్వం పొదుపు సంఘాలకు వడ్డీరాయితీలో మొండిచేయి చూపిన వైనం.* 


*పాదయాత్రలో మహిళల ఆర్థిక కష్టాలను స్వయంగా తెలుసుకున్న శ్రీ వైఎస్ జగన్.* 


*అధికారంలోకి రాగానే సున్నావడ్డీకి రుణాలు ఇప్పిస్తానని హామీ.* 


*కరోనా సంక్షోభంలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న సీఎం శ్రీ వైఎస్ జగన్.*



*రాష్ట్రలో అర్బన్ లో 1.83 లక్షల సంఘాలు, రూరల్ లో 6.95 లక్షల సంఘాలకు మేలు.*



కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోతున్నా లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ తో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. బ్యాంకుల నుంచి చిరు వ్యాపారాలు, జీవనోపాధికి రాష్ట్రంలో రుణాలు పొందిన పొదుపు సంఘాల మహిళలు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు చేసుకోలేక పోతున్నారు. చివరికి తాము తీసుకున్న రుణాలకు గానూ బ్యాంకులకు వడ్డీలు సైతం చెల్లించుకోవడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కష్టాలను గమనించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి "వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం" ద్వారా కరోనా సమయంలో పొదుపు సంఘాలకు అండగా నిలుస్తున్నారు. పొదుపుసంఘాలుగా బ్యాంకుల నుంచి వడ్డీకి రుణాలు తీసుకుని ఆర్థిక స్వావలంభన కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. పొదుపు సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీనిలో భాగంగా ఈనెల 24వ తేదీన ‘’వైయస్ఆర్ సున్నావడ్డీ’’ పథకంను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కరోనా సంక్షోభ సమయంలో... అన్ని వ్యవస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ... పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీతో భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణ నిబంధనలను పాటిస్తూ... క్యాంప్ కార్యాలయం నుంచే ‘’వైయస్ఆర్ సున్నా వడ్డీ’’ పథకంను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా పొదుపుసంఘాలు చెల్లించాల్సిన వడ్డీని బ్యాంకులకు లాంఛనంగా ప్రభుత్వం జమ చేయనుంది. జీవనోపాధికి తీసుకున్న రుణాలను చెల్లించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు చేసుకోలేక సతమతమవుతున్న పొదుపు సంఘాలకు ఈ సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న వడ్డీ రాయితీ నిర్ణయం గొప్ప ఉపశమనం కలిగిస్తోంది.



*మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వ చేయూత*  
రాష్ట్ర వ్యాప్తంగా 8.78 లక్షల సంఘాల్లో సభ్యులుగా వున్న 93 లక్షల మంది మహిళలకు సున్నావడ్డీ పథకం వల్ల లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్ల సాయం అందనుంది. ఈ పథకానికి సంబంధించి గతంలోనే సెర్ఫ్, మెప్మాలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా రెండు రోజుల కిందట రూ.765.19 కోట్లను విడుదల చేసినట్లు సెర్ఫ్ సిఇఓ పి. రాజాబాబు వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పొదుపుసంఘాలు చెల్లించాల్సిన వడ్డీని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు జిల్లాల్లో బ్యాంకులు 7 శాతం, మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13.5 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ భారాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వైయస్ఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రతి పొదుపు సంఘంకు పూర్తి వడ్డీ రాయితీని మూడు లక్షల రూపాయల గరిష్ట రుణం పరిమితి వరకు వర్తింప చేస్తున్నారు. 


*పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ*


స్వయం సహాయక సంఘ అక్కచెల్లెమ్మలకు..
గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ గ్రేడ్‌ సంఘాలు కూడా బీ, సీ, డీ గ్రేడులకు పడిపోయి.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలను నా 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. 


పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేయబోతోంది. 


అంతే కాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన, నామినేషన్‌పై కాంట్రాక్టులు – నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నాను.
ఇట్లు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌


*పొదుపుసంఘాలను నిర్వీర్యం చేసిన టిడిపి ప్రభుత్వం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి* 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలులో వున్న సున్నావడ్డీ పథకంను రాష్ట్ర విభజన తరువాత ఎపిలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. టిడిపి హామీ ఇచ్చిన మేరకు డ్వాక్రాసంఘాల రుణమాఫీ, వడ్డీ రాయితీలపై చిత్తశుద్దితో వ్యవహరించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాధి పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపుసంఘాలకు రుణమాఫీ కింద రూ.14,204 కోట్లు, వడ్డీ రాయితీ కింద రూ.3036 కోట్లను విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ఇంట్రస్ట్ రిడెమ్షెన్ గ్రాంట్ కింద కంటితుడుపుగా వడ్డీ రాయితీ కోసం నిధులను కేటాయించినప్పటికీ, పొదుపుసంఘాలు సకాలంలో బ్యాంకులకు వడ్డీలు చెల్లించకపోవడంతో పెరిగిన చక్రవడ్డీలభారంకు ఈ నిధులు ఏ మూలకూ సరిపోలేదని తెలిపారు. దీనితో ఆర్థిక క్రమశిక్షణ కలిగిన లక్షలాది సంఘాలు బ్యాంకుల దృష్డిలో బకాయిదారులుగా మిగలాల్సి వచ్చిందని అన్నారు. పొదుపు సంఘాలను ఆర్ధికంగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ సున్నావడ్డీ పథకంను అమలు చేయడంతో పాటు వైయస్ఆర్ ఆసరా పేరుతో పొదుపు మహిళలకు చేయూతను అందించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కరోనా విపత్తు సమయంలో మహిళల ఆర్ధిక స్వావలంబనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image