పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోవాలి : సీఎం

అమరావతి


అమరావతి: కోవిడ్‌–19 నివారణా చర్యలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష
కోవిడ్‌–19 పరీక్షల సంఖ్య బాగా పెరిగిందన్న సీఎం
అధికారులను అభినందించిన సీఎం
పరీక్షల విషయంలో వెనకడుగు వద్దన్న సీఎం
పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోవాలి : సీఎం


నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామన్న అధికారులు
మొత్తంగా ఇప్పటివరకూ 48,034 పరీక్షలు చేశామన్న అధికారులు
ప్రతి మిలియన్‌కు 961 టెస్టులతో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం
రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలతో మరింత మెరుగుపడతామన్న అధికారులు


కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని తెలిపిన అధికారులు
నిర్దేశించిన ప్రోటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయన్న అధికారులు
ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌తో ఇప్పటివరకూ 14,423 పరీక్షలు
11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే 
ఈ మొత్తం పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌లు ర్యాండమ్‌ కిట్లలో వచ్చాయన్న అధికారులు
వీటిని నిర్ధారణకోసం పీసీఆర్‌ టెస్టులకు పంపుతున్నామన్న  అధికారులు
కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందన్న అధికారులు


టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు
సింగపూర్,  చైనాల్లో మరోసారి వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైందన్న అధికారులు


జులైలో మరో సర్వే


తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం
వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశం
104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలన్న సీఎం
ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలన్న సీఎం
డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించిన సీఎం
ప్రతిపాదిత కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనేస్థలాలను గుర్తించాలని ఆదేశం


ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయండి: సీఎం
గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలి: సీఎం
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా పంటలు పరిస్థితులు,  ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చు: సీఎం
ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది: సీఎం
 
రూ. 100లకు వివిధ రకాల పండ్లు... ఇవ్వటాన్ని కొనసాగించాలన్న సీఎం
దీన్ని శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలన్న సీఎం


తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ :


పత్రికల్లో తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ 
గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంట పొలంలో వదిలేశారంటూ వచ్చిన కథనంతోపాటు, కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతుబజార్లకు చేరక కుళ్లిపోతున్నాయంటూ ప్రచురించిన కథనాలపై చర్చ.
ఈరెండూ తప్పుడు సమాచారంగా నివేదించిన అధికారులు
కర్బూజా పంట పండించిన  రైతు కుటుంబంతో మాట్లాడమని నివేదించిన అధికారులు
రెండు కోతలు కోసి పంటను ఇప్పటికే తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని, మూడో కోతలో నాసిరకం కాయలు కారణంగా వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆకుటుంబం తెలిపినట్టుగా చెప్పిన అధికారులు.
విజయవాడలో అరటిగెలలు కూడా కడప నుంచి తెప్పించి, స్థానిక మార్కెట్లకు పంపించామని, అంతేతప్ప వాటిని వదిలేయలేదన్న విషయాన్ని వెల్లడించిన అధికారులు
అలాగే కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ, అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను చూపిస్తున్నారని సమావేశంలో చర్చ .