దువ్వూరు హనుమంత రామి రెడ్డి  జ్ఞాపకార్ధం వారి కుమారులు చే కూరగాయలు, పండ్లు పంపిణీ

ఈ రోజు (21.04.2020) చిట్టమూరు మండలం బురదగలి కోత్తపాళెం గ్రామంలో కీ//శే// దువ్వూరు హనుమంత రామి రెడ్డి  జ్ఞాపకార్ధం వారి కుమారులు దువ్వూరు శేషు రెడ్డి ,  దువ్వూరు రామ రాఘవ రెడ్డి , దువ్వూరు మణికంఠ రెడ్డి     సౌజన్యంతో 10 రకాల కూరగాయలు 6 టన్నులు,అరటిపండ్లు 11టన్నులు, కిరిణికాయలు 5 టన్నులు మండలం చుట్టు ప్రక్కల గ్రామాలలోని ప్రజలందరికీ పంపిణీలో పాల్గొన్న *గూడూరు ఎమ్మెల్యే డా//వెలగపల్లి వరప్రసాద రావు.


👉కరోనా వైరస్ గత కొన్ని వారాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారుల ద్వారా వారి శాఖల పరంగా ఏమేమి చేయాలో వాటిని చక్కగా అమలుపరుస్తున్నారని


👉144 సెక్షన్ పెట్టి పోలీసుల ద్వారా ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారని,


👉వాలంటీర్లు గ్రామాలలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని,  


👉ప్రజలు నిత్యం చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, 


👉ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని, 


👉ఈ లాక్ డౌన్ వలన పనులు లేని పేద వారిని ఆదుకొనుటలో  భాగంగా ప్రభుత్వం పెన్షన్ సకాలంలో అందించుట, మూడు విడతలుగా ఉచిత రేషన్, నిత్యావసరాల కొనుగోలు కొరకు వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేశామని  


👉ముఖ్యమంత్రి గారు నాయకులను మీ వంతుగా పేదలకు సహాయం చేయమని కోరగా ఆ మేరకు నాయకులు ముందుకు వచ్చి పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నారని 


👉శేషు రెడ్డి కుటుంబ సభ్యులకు తన తరపున ప్రజల తరపున కృతఙ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే .,
  ఈకార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంట్రీలు వైస్సార్సీపీ పార్టీ నాయకులు రాజా రెడ్డి గారు,వంక రమణయ్య గారు,మధు యాదవ్ గారు,మణి గారు,భాస్కర్  ఉన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..