ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

 


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.


     అమరావతి :      కరోనాపై పోరాడుతున్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, పంచాయితీ, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు  జీతాలు ఇవ్వకపోవటం విచారకరం.


కడప, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్లకు గత మూడు నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయి.


మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రెండు నెలలుగా జీతాలు బకాయి ఉండగా, ఆశా వర్కర్లకు సగం జీతం మాత్రమే ఇస్తున్నారు.


అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శ్రీ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేసే మెయింటినెన్స్ వర్కర్స్ కి మూడు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి.


కరోనా విపత్తు నేపథ్యంలో కార్మికులు విధులను బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.


తక్షణమే బకాయిలున్న జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టండి.
- రామకృష్ణ.