సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం

సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
విజయవాడ :  ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు) :   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బలహీన వర్గాల గృహ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రోడ్లు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగించే సిమెంట్ ధరలు వ్యత్యాసాన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ గా “వైయస్ఆర్ నిర్మాణ్” ను తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రెటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   
         రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున అందుకు అవసరమైన సిమెంటు ను సిమెంట్ కంపెనీల నుంచి తక్కువ ధరకు సకాలంలో పారదర్శకంగా సేకరించాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా  రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో గత నెలలో ముఖ్యమంత్రి అధ్యక్షతన  జరిగిన సమావేశంలో సంప్రదింపులు జరిపి నూతన విధానాన్ని, ధరలను నిర్ణయించడంలో భాగంగా ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు 2020, మార్చి16 నుండి ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే సిమెంట్ కు వస్తు సేవా పన్ను(జిఎస్టీ)లతో కలిపి పోర్ట్ లాండ్ పొజోలాన్ సిమెంట్ ధర రూ. 225 లు, ఆర్డినరీ పోర్ట్ లాండ్ సిమెంట్ ధర రూ. 235 లు చెల్లించాలని నిర్ణయించారన్నారు. అదేవిధంగా కంపెనీలు ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంటును ఎరుపు రంగు బ్యాగులలో సరఫరా చేయడం ద్వారా ప్రయివేటు వ్యక్తులు, సంస్దలకు సరఫరా చేసే సిమెంటు నుండి వేరుచేసి దుర్వినియోగం కాకుండా చూడాలని ఆదేశించారన్నారు. సిమెంట్ సేకరణ, చెల్లింపుల కొరకు సింగిల్ పాయింట్ నోడల్ ఏజెన్సీగా కలెక్టర్ల తో నోడల్ వ్యవస్థను ఉంచాలని నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రాజెక్టులకు అవసరమైన సిమెంటును సిమెంట్ కంపెనీల నుండి పారదర్శక వ్యవస్థ ద్వారా  సేకరించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం గా “వైయస్ఆర్ నిర్మాణ్” అభివృద్ధి చేయబడింది.  ఈ వ్యవస్థ ద్వారా కొనుగోలుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఎటువంటి జాప్యం లేకుండా ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహాయపడుతుందన్నారు. అదేవిధంగా కొనుగోలులో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచటంతో పాటు డిమాండ్ ప్రకారం సిమెంటును ఉత్పత్తి చేయడానికి సరఫరాదారులకు సహాయపడుతుందని ప్రభుత్వ అన్ని విభాగాలు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని www.apindustries.gov.in/YSRNS/Index.aspx  వద్ద ఉపయోగించకోవచ్చని తెలిపారు.
 ఈ వ్యవస్థలో, ప్రభుత్వ విభాగాలు, జిల్లా కలెక్టర్లు, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ తయారీ సంఘం,సరఫరాదారులకు పోర్టల్‌లో యాక్సిస్ ఇవ్వటంతో పాటు వారికి యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌  కేటాయించబడతాయన్నారు. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి, ప్రతి జిల్లాలోని ప్రతి విభాగం నుండి ఇద్దరు అధికారులు (స్థాయి-1&స్థాయి-2) వినియోగదారు ఐడీ లు మరియు పాస్‌వర్డ్ ను కేటాయించాలన్నారు. స్థాయి -2 అధికారి సంబంధిత విభాగాల అవసరాలకు అనుగుణంగా స్థాయి -1 అధికారి కోసం లాగిన్ ఐడిలను సృష్టించాలన్నారు. 
          అదేవిధంగా పరిశ్రమల శాఖ కమీషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టీసీఎస్ వర్కింగ్ టీమ్ మరియు ఆర్థిక శాఖ నుండి నామినేట్ చేయబడిన డిప్యూటీ సెక్రటరీ స్థాయికి తక్కువకాని అధికారి తో ఏర్పాటు చేసిన “వైఎస్ఆర్ నిర్మాణ్ సెల్” ద్వారా పోర్టల్ యొక్క విధులను పర్యవేక్షించడంతో పాటు ప్రతివారం పరిశ్రమల శాఖ గౌరవనీయ ముఖ్యమంత్రి కార్యదర్శి కి నివేదికలు పంపాలని తెలిపారు. ఇక నుండి ప్రభుత్వ శాఖలు పరిశ్రమల శాఖ చే జారీ కాబడిన జీవో మార్గదర్శకాలను అనుసరించి సిమెంట్ కొనుగోలు చేయాలని సమాచార శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image